వారంటే మక్కువ.. వీరంటే తక్కువా..?
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 25 రోజులు అవుతోంది.
కోడ్ అమల్లో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
ప్రత్తిపాడు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 25 రోజులు అవుతోంది. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన అధికారులు అధికార వైకాపా పట్ల ఒకలా...ప్రతిపక్ష పార్టీల విషయంలో మరోలా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రత్తిపాడు మండలం కొండేపాడులో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు అనుమతులు తీసుకుని గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోయవారిపాలెం గ్రామ సచివాలయం కార్యదర్శి చక్రవర్తి ప్రచారం వద్దకు చేరుకుని చరవాణిలో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. గమనించిన తెదేపా నాయకులు అనధికారికంగా ఫొటోలు, వీడియోలు మీరేందుకు తీస్తున్నారు..అది మీ బాధ్యత కాదుగా అని ప్రశ్నించగా, పంచాయతీ కార్యదర్శి ఆదేశించారని సమాధానమిచ్చారు. దీనిపై సదరు కార్యదర్శి శ్వేతతో రామాంజనేయులు మాట్లాడగా..ఎంపీˆడీవో దుర్గాప్రసాద్ ఆదేశాలతో తీయిస్తున్నామని బదులివ్వడం గమనార్హం. విషయాన్ని ప్రత్తిపాడు ఎన్నికల అధికారి పి.శ్రీకర్ దృష్టికి ‘న్యూస్టుడే’ తీసుకెళ్లగా, ఎంపీˆడీవోతో మాట్లాడతానని చెప్పారు.
ట్యాంకుపై పసుపు రంగు ఉందని కేసు.. ప్రత్తిపాడులో నీటి ఎద్దడి నేపథ్యంలో తండ్రి పేరుతో ట్రాక్టరు ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేస్తున్న నూతలపాటి అమర్నాథ్పై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కేసు నమోదు చేయించారు. ఆయన తండ్రి పరమేశ్వరరావు మృతి చెందినప్పటికీ గతంలో తెదేపా నాయకుడిగా ఉన్నారని, ఆయన చిత్రం ట్యాంకుపై అంటించి సరఫరా చేయడం కోడ్ ఉల్లంఘనే అని ఎంపీˆడీవో దుర్గాప్రసాద్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చెప్పడం గమనార్హం.
అనుమతుల్లేకున్నా చర్యలు శూన్యం.. పెదనందిపాడులో గత నెల 28న వైకాపా ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్, నాయకులతో కలిసి రోడ్డు షో, ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీకి అనుమతులు లేవని గుర్తించి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో వైకాపా నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతోపాటు లెక్కచేయకుండా ర్యాలీ కొనసాగించారు. ఈ క్రమంలో అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం