సీఎం జగన్.. ఆయన సామంతులకు కూల్చివేతలే తెలుసు
రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు.
మంగళగిరిలో తటస్థులతో సమావేశమైన నారా లోకేశ్
తమ ఇంటిని కూల్చివేశారని లోకేశ్ వద్ద వాపోతున్న బాధిత కుటుంబం
మంగళగిరి, న్యూస్టుడే: రానున్న ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానని మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరికి చెందిన తటస్థ ప్రముఖులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. పట్టణంలోని నాల్గో వార్డుకు చెందిన జంజనం మల్లేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. నిర్మాణంలో ఉన్న తమ భవనాన్ని గత ఏడాది అక్టోబర్లో ఎమ్మెల్యే ఆర్కే ప్రోద్బలంతో అధికారులు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడి దేవాలయ భూముల్లో నివాసం ఉంటున్నామని, తాము ఇళ్లు నిర్మిస్తుండగా నిలిపివేయాలని దేవాలయ అధికారులు నోటీసులు జారీ చేయడంతో తాను హైకోర్టును ఆశ్రయించానని మల్లేశ్వరరావు వివరించారు. న్యాయస్థానం స్టే ఇచ్చిందని, సంబంధిత పత్రాలను తెచ్చేలోగానే అధికారులు నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేశారని వాపోయారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ జగన్ ఆయన సామంతులకు తెలిసింది కూల్చివేతలు మాత్రమే అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక దేవాదాయశాఖ వారికి ప్రత్యామ్నాయ భూమి చూపించి దీర్ఘకాలంగా నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలిచ్చే విధంగా తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని, ముడి సరుకు రాయితీతోపాటు చేనేత వస్త్రాలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 14వ వార్డుకు చెందిన మున్సిపల్ మాజీ ఛైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు కార్యాలయాన్ని లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమయ్యారు. మంగళగిరి చేనేతలపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. మంగళగిరిలో 25 అత్యాధునిక మగ్గాలతో వీవర్స్శాల ఏర్పాటు చేసి టాటా సంస్థతో ఒప్పందం చేసుకుని ఉత్పత్తి అయిన వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు