ప్రజా గళానికి బ్రహ్మరథం
జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలకు జనం పోటెత్తారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో తెదేపా నాయకుల్లో ఉత్సాహం తొణికిసలాడింది.
కొల్లూరు, రేపల్లె సభలకు పోటెత్తిన జనం
చంద్రబాబునాయుడుకు అడుగడుగునా ఘన స్వాగతం
ఈనాడు - బాపట్ల, న్యూస్టుడే - రేపల్లె, బాపట్ల, కొల్లూరు బృందం
జిల్లాలో వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ప్రజాగళం సభలకు జనం పోటెత్తారు. తెదేపా-జనసేన-భాజపా కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో తెదేపా నాయకుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. తొలుత వేమూరు నియోజకవర్గం కొల్లూరులో జరిగిన సభకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడును వేమూరు మార్కెట్యార్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా ఎదురేగి వెళ్లి బాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కొల్లూరు సభా ప్రాంగణం చేరుకునే వరకు అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతించారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. ర్యాలీలో బాబు వెంట వేలాది వాహనాలు సాగాయి. సుమారు ముప్పావు గంట సేపు రోడ్షో నిర్వహించడంతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, కమలనాథులతో కొల్లూరు రహదారులు కిటకిటలాడాయి. స్ధానికంగా కృష్ణా డెల్టా ఆధునికీకరణకు గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. వైకాపా ప్రభుత్వ తీరుతో డెల్టా రైతాంగం దారుణంగా దెబ్బతిందని ఈ ఏడాది వారికి తుపాను వచ్చి పంటలు నష్టపోయినా పలకరించే వైకాపా నాథుల్లేరని చేసిన ప్రసంగానికి సభికుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ఆనందబాబు అంటూ పరిచయం చేశారు. ఆనందబాబు ఏ పని అప్పగించినా సమర్థంగా పని చేస్తారని అలాంటి నాయకుడిని మీరు అత్యధిక మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలోని రోడ్లు, పోతార్లంక ఎత్తిపోతల పథకం, నీటి కొరత వంటి సమస్యలను తెదేపా అధికారంలోకి రాగానే పరిష్కరిస్తుందని హమీనిచ్చారు. దీంతో సభికులు జై బాబు.. అంటూ నినాదాలు హోరెత్తించారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్ నిజాయతీ అధికారిగా పనిచేశారని, సేవాగుణం కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని పార్లమెంట్కు పంపాలని కోరారు.
నేడు అభ్యర్థులతో సమీక్ష : ప్రజాగళం సభ ముగిసిన అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు రేపల్లెలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం ఉదయం తెదేపా అభ్యర్థులు, కీలక నేతలతో చంద్రబాబు అంతర్గత సమావేశాలు నిర్వహించి ప్రచారం సాగుతున్న తీరు, వైకాపాను ధీటుగా ఎదుర్కొని జిల్లాలోని అన్ని స్థానాల్లో ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉప్పూడి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి హెలీకాఫ్టర్లో చంద్రబాబు బయల్దేరనున్నారు.
దండుపాళ్యం బ్యాచ్ వేమూరుకొచ్చింది
మంత్రి మేరుగ నాగార్జున ఇసుకను ఎడాపెడా దోచేశాడని తెదేపా అధినేత చంద్రబాబు కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆరోపించారు. దీంతో నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని గమనించి వేరే చోటికి పరారయ్యారన్నారు. ఇంకొకాయన ఎక్కడో కొండెపి నుంచి ఇక్కడికి వచ్చాడని ఆయనో ‘దండుపాళ్యం బ్యాచ్’ అని విమర్శించారు. అక్కడి పనికి రాని చెత్తను ఇక్కడకి పంపిస్తే అది మంచిదవుతుందా? అన్ని ప్రశ్నించారు. ఇక బాపట్ల ఎంపీ సురేష్ గురించి అందరికీ తెలుసునన్నారు. వీరంతా కలసి ప్రజల సంపదను దోచేశారని విమర్శించారు. వీళ్లు మళ్లీ ఓట్లు దండుకోవడానికి రకరకాల విన్యాసాలతో మీ ముందుకు వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
రేపల్లెలో అట్టహాసంగా..
రేపల్లె పట్టణం చేరుకోవడానికి కొల్లూరు నుంచి రోడ్డు మార్గాన బయలుదేరగా దారి పొడవునా ఆయా గ్రామాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నిర్దేశిత సమయం కన్నా రేపల్లె పట్టణానికి ఆలస్యంగా చేరుకున్నా కార్యకర్తలు వేలాదిగా పెనుమూడి వారధి వద్దకు తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పట్టణంలోని సభా ప్రాంగణానికి చేరుకోవడానికి గంటకు పైగా పట్టింది. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మీకు అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని అతన్ని ఆశీర్వదించాలని కోరారు. వాన్పిక్ సిటీ, నిజాంపట్నం ఓడరేవు అభివృద్ది, డెల్టాలో కాలువల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. శుక్రవారం రాత్రి చంద్రబాబు రేపల్లె పట్టణంలోనే బస చేశారు.
పులివెందుల, కడప సహా 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు కూటమి కైవసం చేసుకోవాలని దేశంలో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలవబోతోందని అన్నప్పుడు సభికుల నుంచి బాగా స్పందన వచ్చింది. జగన్ నాసిరకం మందుతో కిడ్నీలు లాగేస్తున్నాడని చెప్పగానే ఓ కార్యకర్త బాటిల్ చూపారు. తమ్ముడు ఆ బాటిల్ ధర రూ.200 అవునా కాదా అంటూ ప్రశ్నించగా అవునంటూ సమాధానం వచ్చింది.
చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాజీ మంత్రి ఆనందబాబు, బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్
వృద్ధుల ఆనందోత్సాహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట