అరగంట ‘సిద్ధం’.. 5 గంటల యుద్ధం
సీఎం జగన్ జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ అటు వైకాపా కార్యకర్తలతో పాటు సాధారణ ప్రయాణికులను అష్టకష్టాల పాల్జేసింది. సీఎం సభలకు జనాదరణ లేకపోవడంతో ఎలాగైనా మందబలం చూపించుకోవడానికి వైకాపా నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
జగన్ వస్తే జనానికి నరకమే
జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇక్కట్లు
మహిళలకు తప్పని పాట్లు
క్రమబద్ధీకరించలేక చేతులెత్తేసిన పోలీసులు
వాహనాల మధ్యలో ఇరుక్కుపోయిన అంబులెన్స్
ఈనాడు, అమరావతి, జిల్లా పరిషత్తు, మేడికొండూరు, నగరంపాలెం, ఏటీ అగ్రహారం, పెదకాకాని, గుంటూరు రూరల్, గోరంట్ల న్యూస్టుడే : సీఎం జగన్ జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ అటు వైకాపా కార్యకర్తలతో పాటు సాధారణ ప్రయాణికులను అష్టకష్టాల పాల్జేసింది. సీఎం సభలకు జనాదరణ లేకపోవడంతో ఎలాగైనా మందబలం చూపించుకోవడానికి వైకాపా నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి సుమారు 1150 బస్సులను కేటాయించారు. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రధాన బస్టాండ్లలో బస్సులు లేక గమ్యస్థానాలకు చేరుకోలేక సాధారణ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సభలో సీఎం 26 నిమిషాలు మాత్రమే ప్రసంగించగా.. జనం మాత్రం సుమారు 5గంటల పాటు నరకం చూశారు.
కాలకృత్యాలకూ అవకాశం లేక..
ఏటుకూరు వద్ద జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సభా ప్రాంగణానికి వచ్చిన వారు గంటల కొద్దీ జాతీయ రహదారి మీదనే వాహనాల్లో ఉండిపోయారు.వాహనాలు దిగిన వారు సైతం కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవకాశం లేకపోయింది. చుట్టూ మగవారు ఉండడంతో మహిళలు కనీసం లఘుశంక తీర్చుకోవడానికి ఎటువెళ్లాలో తెలియక నరకం చూశారు. ఎరక్కపోయి వచ్చి చిక్కుకుపోయామని ఆవేదన చెందారు. సభా ప్రాంగణం వెలుపల సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేసినా అక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
జాతీయ రహదారిపై నిలిచిన ట్రాఫిక్
రెండు వైపులా 2.5 కి.మీ మేర బారులు
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్షం కురవడంతో జాతీయ రహదారి పక్కన ఏటుకూరు సమీపంలోని పొలాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం బురదమయంగా మారింది. మధ్యాహ్నం 3గంటల సమయంలో జనాలను తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సులు పార్కింగ్ ప్రదేశాల్లో ఎక్కడికక్కడ పొలాల్లో దిగబడిపోయాయి. దీంతో వెనుక వచ్చిన వాహనాల డ్రైవర్లు బస్సులను జాతీయ రహదారిపై రెండు వరుసల్లో నిలబెట్టేశారు. దీంతో జాతీయ రహదారి మీద ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి. మూడో వరుసలో మాత్రమే వాహనాలు వెళ్లాల్సి రావడంతో జాతీయ రహదారి చిలకలూరిపేట వైపు రెండున్నర కిలోమీటర్లు, విజయవాడ వైపు వెళ్లే రహదారి వైపు మరో రెండున్నర కిలోమీటర్ల చొప్పున వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 6.30 గంటలకు కూడా బాపట్ల, ఇతర దూర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో జనాలను తీసుకొస్తుండడంతో ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఇబ్బందులు కొనసాగాయి.
ప్రత్యక్ష నరకం
జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 3గంటల నుంచి చేరుకున్నారు. అకాల వర్షంతో సభా ప్రాంగణం, చుట్టుపక్కల బురదమయం కావడం, జాతీయ రహదారి మీద బస్సులు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. దీంతో సభకు వచ్చిన వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. సీఎం జగన్ రాత్రి 7గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోవడంతో ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగాయి. జనాలను సభకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యం ఇచ్చిన అధికార పార్టీ నాయకులు వారికి సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఉన్నాయి.
పేరేచర్ల నుంచి గుంటూరు వెళ్లే దారిలో అనంతారం కూడలి వద్ద అస్తవ్యస్థంగా..
వాహనాల దారిమళ్లింపుతో చుక్కలు
పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నుంచి సత్తెనపల్లి మీదుగా మేడికొండూరు మండలం, నల్లపాడు మీదుగా సీఎం జగన్ ఏటుకూరుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12గంటలకు గుంటూరు నుంచి మేడికొండూరు మీదుగా పల్నాడు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కార్లు, లారీల వంటి భారీ వాహనాలను ఫిరంగిపురం వైపు దారి మళ్లించారు.దీని వల్ల అటువైపు బస్సులు లేక ఆటోలు మాట్లాడుకుని వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం సీఎం పేరేచర్ల దాటి వెళ్లాక వాహనాలు నియంత్రించకపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికంగా అర్ధగంట సేపు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
తీగలు తొలగించి... విద్యుత్తు నిలిపేసి..
సీఎం బస్సు వస్తున్న నేపథ్యంలో మేడికొండూరు, పేరేచర్ల, కొర్రపాడు, జంగంగుంట్లపాలెం వద్ద ప్రధాన రహదారిపై మధ్యాహ్నం 12గంటలకు విద్యుత్తు తీగలు తొలగించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా లేక అవస్థలు పడ్డారు. తీవ్ర ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం 5గంటలకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం