జగనన్న కాలనీ ఖాళీ స్థలాలకు ఎసరు!
తక్కువ ధరకే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు.. కాకపోతే ఎన్నికలు అయిన వెంటనే పట్టాలు మీ చేతుల్లో పెడతామంటూ ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కాలనీలోని ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టాడు
ఓ వీఈర్వో నిర్వాకం
కొత్తరెడ్డిపాలెం జగనన్న కాలనీ
తక్కువ ధరకే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు.. కాకపోతే ఎన్నికలు అయిన వెంటనే పట్టాలు మీ చేతుల్లో పెడతామంటూ ఓ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కాలనీలోని ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టాడు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో మూడు లేఔవుట్లలో చేబ్రోలు, కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాళేనికి చెందిన సుమారు 560 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. ఇంకా కొన్ని ప్లాట్లు మిగిలిపోయాయి. వాటిని వీఆర్వో అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు తెరదీశాడు. గ్రామానికి కాలనీ దగ్గరగా ఉండటం.. 100 వరకు ఇళ్లు పూర్తై నివాసాలు ఉండటంతో కాలనీ కొంత అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు స్థానికులు ముందుకు వస్తున్నారు. ఇదే అదునుగా చేసుకున్న ఆ వీఆర్వో ప్రధాన రహదారి వెంట ఉన్న ప్లాట్లకు రూ. 50 వేలు చొప్పున, అంతర్గత రహదారి వెంట ఉన్న ప్లాట్లకైతే రూ.30 వేలు వంతున బేరం పెట్టాడు. ప్రస్తుతం నగదు చెల్లించి ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని, ఎన్నికల తరవాత ఇళ్ల పట్టాలు మీ పేరునే ఇస్తామని చెబుతున్నాడు. కావాలంటే నగదు చెల్లించే సమయంలో ఉన్నతాధికారులకు చేత మాట్లాడిస్తానని హామీ కూడా ఇస్తున్నాడు.
గతంలోనూ ఇలా..
గతంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన సమయంలో ఈ వీఆర్వో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో సుమారు 15 వరకు అవకతవకలు బయటపడ్డాయి. ఆన్లైన్లో లబ్ధిదారుడి పేర్లకు డీకే పట్టాలు పొందిన వారి వివరాల్లో తేడాలు ఉన్నట్టు తహసీల్దార్ గుర్తించారు. అప్పటికే పట్టాలు పొందిన కొందరు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. బయటకు పొక్కితే తమ శాఖ పరువేపోతుందని.. ఎవరి పేరున అయితే డీకే పట్టాలు అందించారో వారి వివరాలు సేకరించి ఆన్లైన్లో సరిచేసి రిజిస్ట్రేషన్ చేశారు. బీ ఈ విషయమై తహసీల్దార్ రమాదేవిని వివరణ కోరగా అలా అమ్ముకునే అవకాశం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల ఓ లబ్ధిదారుడు కాలనీలో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను పక్కనే ఉన్న ఖాళీ ప్లాట్లో పోయించాడు. పనులు జరుగుతుండగా.. ఓ వ్యక్తి వచ్చి ఈ స్థలం తనదని, మీరు వెంటనే ఇసుకను తీసివేయాలన్నాడు. ఇది గతంలో ఎవరికీ మంజూరు చేయలేదు కదా.. మీది ఎలా అవుతుంది అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు పొక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!