తెదేపా గూటికి మాజీ ఎమ్మెల్యే రావి
జిల్లాలో వైకాపాకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి వలస వెళ్లే నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.
నేడు ప్రత్తిపాడులో చంద్రబాబు సమక్షంలో చేరిక
ఈనాడు, అమరావతి
జిల్లాలో వైకాపాకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. అధికార పార్టీ నుంచి వలస వెళ్లే నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఆమె భర్త సురేష్కుమార్ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి శుక్రవారం గుంటూరులో పర్యటిస్తున్న సమయంలోనే వారు తెదేపాలో చేరడం గమనార్హం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వైకాపా ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పని చేశారు. 2014లో వైకాపా తరఫున పొన్నూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా పని చేశారు. 2019లో పొన్నూరు నుంచి పోటీ చేస్తారని భావించారు. చివరి నిమిషంలో వైకాపా అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వడంతో కిలారి రోశయ్య గెలుపు కోసం పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోశయ్య క్రమంగా రావి వెంకటరమణ, ఆయన వర్గాన్ని దూరం పెట్టడంతో వ్యతిరేక వర్గంగా ఉండిపోయారు. మరోవైపు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రావి వెంకటరమణ వర్గం అధిష్ఠానంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. పార్టీలో అంతర్గత పోరు నేపథ్యంలో రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనను అకారణంగా ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని అధిష్ఠానాన్ని ప్రశ్నించినా సమాధానం లేదు. ఈ క్రమంలో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న విషయమై చర్చ మొదలైంది. వరుసగా కార్యకర్తలతో సమావేశాలు పెట్టి వారి అభిప్రాయాలు సేకరించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న ఆయన తెదేపా వైపు మొగ్గుచూపారు. తెదేపా నేతలు రావివెంకటరమణతో చర్చించి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన స్వగ్రామం ప్రత్తిపాడు నియోజకవర్గం అబ్బినేనిగుంటపాలెం కావడం, ప్రత్తిపాడు నుంచి 2004లో ఎమ్మెల్యేగా పనిచేయడంతో నియోజకవర్గంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో 2014లో వైకాపా తరఫున పోటీ చేయడం, పదేళ్ల పాటు ఇన్ఛార్జిగా చేయడంతో అక్కడ కూడా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో రావి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఏటుకూరు బైపాస్ నుంచి ర్యాలీగా ప్రత్తిపాడు చేరుకుని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే వైకాపాకు చెందిన పలువురు జిల్లా స్థాయి నేతలు తెదేపా తీర్థం పుచ్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి