మాటల్లో గారడీ.. చేతల్లో బురిడీ..
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం..
డ్వాక్రా మహిళలకు చేసిందేమిటి జగన్
బటన్ నొక్కినా ఖాతాల్లో జమ కాని ఆసరా నగదు
న్యూస్టుడే, సత్తెనపల్లి
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు బ్యాంకులకు రుణాలు కట్టొదు. మన ప్రభుత్వం రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తాం.. వడ్డీలేని రుణాలిస్తాం.. స్వయం ఉపాధి శిక్షణ ఇస్తాం.. మీ పిల్లల చదువుకు, కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా ఇస్తామంటూ మాయమాటలతో జగన్ నమ్మించారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ విషయంలో మడత పేచీ పెట్టారు. సీఎం అయ్యేరోజుకు ఉన్న రుణాల్ని మాఫీ చేయకుండా 2019 ఏప్రిల్ 11వరకు ఉన్న రుణాలు మాత్రమే చెల్లించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల అభ్యున్నతికి కొత్తగా ఒక్క పథకం అమలు చేసింది లేదు.
స్వయం ఉపాధి శిక్షణ ఏదీ..?
డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ద్వారా స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించింది. టైలరింగ్, ఎంబ్రాయిడరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఒక్కో పట్టణంలో ఏటా 300 నుంచి 400 మంది, మండలాల్లో 200 నుంచి 300 మంది స్వయం ఉపాధి శిక్షణ పొంది ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వైకాపా డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ఎప్పుడో మరిచిపోయింది. ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్క స్వయం ఉపాధి శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయలేదు.
సున్నా వడ్డీ.. ఉత్తదే..
నా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాలిస్తానని జగన్ గొప్పగా గత ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ సున్నావడ్డీని ఒకటిగా చేర్చినా సక్రమంగా అందించలేకపోయారు. రుణం తీసుకున్నప్పుడు వడ్డీలేని విధంగా రుణాలివ్వకుండా ఏడాదికి ఒకసారి బటన్ నొక్కే విధానం పెట్టారు. సున్నావడ్డీ అర్హతకు ఎన్నో ఆంక్షలు పెట్టారు. దీంతో చాలా సంఘాలు, సభ్యులు సున్నా వడ్డీకి దూరమయ్యాయి. గతేడాది ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 41,400 సంఘాల్లోని 4,14,910 మందికి రూ.58.02 కోట్ల సున్నా వడ్డీ లబ్ధికి బటన్ నొక్కినా ఇప్పటికీ వేలాది సంఘాలకు లబ్ధి జమ కాలేదు. దీనికి సాంకేతిక కారణాలు, ఖాతాల్లో తప్పులంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.
వెలుగుచూసిన అవకతవకలు
డ్వాక్రా సంఘాలకు రుణాల పంపిణీతోపాటు సమాఖ్యల నిర్వహణలో చాలాచోట్ల అవకతవకలు బయటపడ్డాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం వెళ్లిన మంత్రి అంబటితో బ్యాంకు లింకేజి రుణానికి రూ.లక్షకు రూ.2 వేలు లంచంగా తీసుకుంటున్నారని డ్వాక్రా మహిళ ప్రశ్నించింది. చాలాచోట్ల ఇవే ఫిర్యాదులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వచ్చాయి. ఉద్యోగులు, గౌరవ వేతనంపై పనిచేసే వారు అడిగినంత ఇవ్వకుంటే రుణం నిలిపేసి ఇబ్బందులు పెడతారని ఇప్పటికీ డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. సంఘాల పొదుపు నగదు అధికార పార్టీ నాయకుల సహకారంతో స్వాహా చేసిన ఘటనలు కూడా జిల్లాలో వెలుగు చూశాయి.
మహిళా సంఘాలకు భవనాల నిర్మాణమేదీ?
ఉపాధి నిధులకుతోడు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో మండలాల్లో మహిళా శక్తి భవనాల్ని తెదేపా ప్రభుత్వం నిర్మించింది. దీంతో అద్దె భవనాల నుంచి వాటికి చాలాచోట్ల విముక్తి లభించింది. జగన్ పాలనలో మహిళా శక్తి భవనాల నిర్మాణం ఊసే లేకుండా పోయింది.
రుణసాయం కేంద్రానికి వదిలేసి..
డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా లింకేజి రుణాలు, రుణసాయం తెదేపా ప్రభుత్వ హయంలో గొప్పగా జరిగేది. ఏటా జిల్లాలోని సంఘాలకు రూ.200 నుంచి రూ.300 కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించి మెప్మా, సెర్ప్ అధికారులు, ఉద్యోగులను పరుగులు పెట్టించేవారు. వైకాపా ప్రభుత్వం బ్యాంకు లింకేజి రుణాలన్నీ కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేశారు. కొవిడ్ సమయంలో కేంద్రం డ్వాక్రా సంఘాల రుణ పంపిణీ లక్ష్యాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. బ్యాంకులకు విరివిగా డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు చేసింది. దీంతో బ్యాంకులు ఆర్థిక క్రమశిక్షణ పాటించే సంఘాలకు కోరినంత రుణాలు ఇస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుని అసలు సాయాన్ని ఎప్పుడో మరిచిపోయింది. ఉన్నతి పథకం కింద నిరుపేద కుటుంబాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబనకు రుణాల్ని గత ప్రభుత్వం అందజేస్తే ఈ ప్రభుత్వం మమ అనిపించింది.
జగన్ను నమ్మరు
డ్వాక్రా మహిళలకు జగన్ అరచేతిలో వైకుంఠం చూపించారు. వారి ఆశలు అడియాసలు చేశారు. ఐదేళ్లలో వారి కోసం ఒక్క పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయలేదు. డ్వాక్రా రుణమాఫీకి ఆసరా అంటూ ఉత్తుత్తి బటన్లు నొక్కారు. ఎప్పుడో జనవరిలో నొక్కిన బటన్కు ఇప్పుడు కూడా డబ్బులు ఖాతాల్లో పడలేదు. స్వయం సహాయక సంఘాలతోపాటు వాటిలోని సభ్యులకు గుర్తింపు, గౌరవం చంద్రబాబుతోనే ఉంటాయి. మరోసారి జగన్ను డ్వాక్రా మహిళలు నమ్మే పరిస్థితి లేదు.
బీమినేని వందనాదేవి, డ్వాక్రా సంఘాల రాష్ట్ర నాయకురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం