కిలారీ.. మాట తప్పారు
పొన్నూరు 23వ వార్డు ఇందిరా కాలనీలో మురుగు కాలువ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగారు.
డ్రెయిన్లు నిర్మించలేదు
దోమల బెడదతో ప్రజల ఇబ్బంది
29వ వార్డులో గృహాల మధ్య నిలిచిన మురుగు
పొన్నూరు, న్యూస్టుడే : పొన్నూరు 23వ వార్డు ఇందిరా కాలనీలో మురుగు కాలువ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ తిరిగారు. ఆ సమయంలో మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కొంత కాలం తర్వాత ఎమ్మెల్యే వెంకటరోశయ్య సిమెంటు మురుగుకాలువ నిర్మాణ పనులకు రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటించారు. రోజులు గడుస్తున్నా పనులు ప్రారభించలేదు. వర్షం కురిస్తే మోకాలు లోతు నీటిలో రాకపోకలు నిర్వహిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- వైకాపా నేతలు బడాయి మాటలతో కాలయాపన చేసి ప్రజా సమస్యలను పరిష్కరించలేదని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. సిమెంటు మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టమని స్థానికులు వైకాపా నేతలను కోరినా చూద్దాం.. చేద్దాంలే అంటూ మాటలతో మభ్య పెట్టారని పురప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- పొన్నూరు 6, 10, 11, 14, 15, 17, 18, 23, 25, 29 వార్డుల్లోని తదితర కాలనీల్లో సిమెంటు మురుగు కాలువ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో సుమారు 15 కిలోమీటర్ల లోపు సిమెంటు మురుగు కాలువ పనులు చేపట్టినట్లు ఇంజినీరింగ్ అధికార గణాంకాలు చెబుతున్నాయి. మురుగు వెళ్లే మార్గం లేకపోవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిల్వ ఉంటోంది. కొన్ని కాలనీల్లో మురుగు ఇళ్ల మధ్య చేరడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
- మురుగునీరు నిల్వ ఉండటంతో దోమల బెడదతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిడుబ్రోలు, డీవీసీ కాలనీ, ఓంకాలనీ, శంకర మఠం వెనక వైపు తదితర ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలాయి. ఎక్కువ మంది రోగులు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకున్నారు.
- పొన్నూరు పరిధి 29వ వార్డు ఓం కాలనీలో కొంత కాలం కిందట సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేసి పిమెంటు రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. డ్రెయిన్ పనులు చేపట్టకపోవడంతో మురుగు పోయే మార్గం లేక గృహాల మధ్య ఉన్న ఖాళీ సల్థాల్లోకి చేరుతోంది. ఈ కాలనీలో గతంలో విష జ్వరాలు ప్రబలి అనేక మంది మంచం పట్టారు.
వర్షం వస్తే అవస్థలే
గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కింద ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మా వార్డులో పర్యటించినప్పుడు మురుగు కాలువ నిర్మించాలని కోరాం. పనులకు రూ. 5 లక్షలు కేటాయించామని చెప్పారు. రోజులు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభించలేదు. వర్షం పడితే రాకపోకలు నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
గుమ్మడి సాల్మన్ రాజు 23వ వార్డు
దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం
మా వార్డులో సుమారు 20 ఏళ్ల కిందట ఇల్లు నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు కచ్చా కాలువలను కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి వద్ద గుంతులు తీసుకున్నాం. మురుగు పారుదల లేక దుర్వాసనతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. వాసనతో ఇంట్లో ఉండలేకపోతున్నాం. దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు
రాముల రమణమ్మ, 18వ వార్డు
దోమలతో ఉండలేకపోతున్నాం
పక్కా డ్రెయిన్లు లేక మురుగు ముందుకు కదలడం లేదు. చాలా రోజుల నుంచి దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమ కాటు వల్ల జ్వరాలు వస్తాయని భయమేస్తోంది. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని పురపాలక సంఘ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేసింది.
పాములపాటి నరేంద్ర 11వ వార్డు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?