మేం చేసిన నేరమేంటి.. ఈ నిరీక్షణేంటి?
తిరుమలలో దైవదర్శనం చేసుకుని వచ్చి మంగళగిరి వెళ్లాల్సిన శ్రీనివాస్ కుటుంబం శుక్రవారం గుంటూరులో బస్సు దిగింది. ఇక్కడ నుంచి పల్లెవెలుగు బస్సు కోసం నాలుగు గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది.
సీఎం జగన్ గుంటూరు సభకు భారీగా ఆర్టీసీ సర్వీసులు
ప్రయాణికులకు తప్పని యాతన
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
నిర్మానుష్యంగా చిలకలూరిపేట బస్టాండ్
తిరుమలలో దైవదర్శనం చేసుకుని వచ్చి మంగళగిరి వెళ్లాల్సిన శ్రీనివాస్ కుటుంబం శుక్రవారం గుంటూరులో బస్సు దిగింది. ఇక్కడ నుంచి పల్లెవెలుగు బస్సు కోసం నాలుగు గంటలు ఎదురుచూడాల్సి వచ్చింది. చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారు. దూరప్రయాణం చేసి అలిసిపోయారు. బస్సుల్లేవు. ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు.
గుంటూరులోని ఏటుకూరు వద్ద వైకాపా శుక్రవారం నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సులు కేటాయించడంతో ప్రయాణికులకు ఆర్టీసీ సర్వీసులు లేక ఇబ్బందులు పడ్డారు. వైద్యం కోసం విజయవాడ, గుంటూరు వెళ్లాలనుకుని బయల్దేరిన వారు బస్టాండ్లలో చిక్కుకుపోయారు. వైకాపా సభకు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను భారీసంఖ్యలో కేటాయించారు. ఈ ఐదు జిల్లాల నుంచి సుమారు వెయ్యి బస్సుల వరకు సభకు తరలాయి. దీంతో ఆయా జిల్లాల్లో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వినుకొండ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వారు బస్సుల్లేక మూడుగంటల పాటు బస్టాండ్లోనే చిక్కుకుపోయారు. వచ్చే అరకొర బస్సుల్లోనే కిక్కిరిసి వెళ్లారు. ఉక్కపోత, ఎండకు తోడు రద్దీ ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
సత్తెనపల్లి నుంచి గుంటూరు మార్గంలో సీఎం జగన్ రోడ్షో ఉండడంతో బస్సులను నిలిపేశారు. కొన్నింటిని మళ్లించారు. అత్యవసర పనుల నిమిత్తం బయల్దేరిన వారు సమయానికి గమ్యస్థానాలను చేరుకోలేకపోయారు. రెండు గంటలు ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు బస్సులు నిలిపేయడంతో ఎండ, ఉక్కపోతకు అల్లాడిపోయారు.
నరసరావుపేటలో ప్రయాణికుల ఎదురుచూపు
అధికంగా చెల్లించి..
ఈనెల 9న ఉగాది, 11న రంజాన్ పండగలొచ్చాయి. మధ్యలో 10వ తేదీసెలవు పెట్టి చాలామంది పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. పండగ సెలవులు ముగిశాయని శుక్రవారం సొంతూళ్ల నుంచి పట్టణాలకు బయల్దేరారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు ఆటోల్లో సామానులతో వస్తే బస్సుల్లేక ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. బస్సుల కోసం ఎండలోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఎంతకూ బస్సులు రాకపోవడంతో అవస్థలు పడ్డారు. కొందరైతే రూ.50 ఛార్జీకి ఆటోల్లో రూ.100 చెల్లించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. పల్లెవెలుగు బస్సులన్నింటినీ తరలించడంతో గ్రామాలకు బస్సులు రాలేదు. చాలామంది తమ రోజువారీ కార్యకలాపాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొందరు అధిక ఛార్జీలు చెల్లించి ఆటోల్లో వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్