పోలీసు.. వైకాపాకు వత్తాసు
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
అధికార పార్టీ నేతలకు మేలు చేసేలా నిర్ణయాలు
ఎంసీసీ బృందాలపై విమర్శలు
సీఐ.. ఎస్సైలకు చెక్పోస్టు విధులు
ఈనాడు-బాపట్ల: సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది. వారికి రోజు మార్చి రోజు ఆ డ్యూటీలు వేయడంతో స్టేషన్ పరిధిలో జరిగే ఘటనలపై వారు దృష్టిసారించలేకపోతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెక్పోస్టుల వద్ద పహారా కోసం అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వారిని కాదని శాంతిభద్రతల విభాగంలో ఉండే పోలీసుల్ని పంపడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో లా అండ్ ఆర్డర్లో పని చేసే రెగ్యులర్ ఎస్సై, సీఐలను రోజు మార్చి రోజు చెక్పోస్టు డ్యూటీలకు పంపుతున్నారు. ఇదే అదనుగా ఆయా స్టేషన్ల పరిధిలో అధికారులు లేకుండా చూసి కొందరు వైకాపా అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఎవరైనా తాయిలాలు పంపిణీ చేస్తున్నారని స్టేషన్కు సమాచారమిచ్చినా ఎస్సై, సీఐలు లేరని చెప్పి పంపిణీ క్రతువు ముగిశాక ఆలస్యంగా చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగానే లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకించి ఆయా స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఈ డ్యూటీలు వేయడం గమనార్హం. ఇలా చేయడం అంటే కొందరు అభ్యర్థులకు మేలు చేయటమేనని వినికిడి. ఇప్పటికే జిల్లాలో కొందరి పోలీసుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా తీరు మార్చుకోవడం లేదు. ఆ మధ్య బల్లికురవ ఎస్సై స్టేషన్లోనే అధికార వైకాపా నాయకులతో శాలువా కప్పించుకున్నారు. దీన్నిబట్టి అధికార వైకాపాతో పోలీసులు ఎలా అంటకాగుతున్నారో ఆ ఉదంతం చెప్పకనే చెబుతోంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారా? లేదా? ఏమైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా? ప్రచారాలకు వినియోగించే వాహనాలకు అనుమతులు ఉన్నాయా లేవా అనేవి పరిశీలించడానికి ఎంసీసీ బృందాలు ఉన్నాయి. ఆ బృందాల్లో పోలీసులు ఉంటారు. ఎవరైనా తాయిలాలు పంపిణీ చేసినా, వాహనాలు అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేస్తున్నా వాటిని గుర్తించి సీజ్ చేయాల్సింది ఎంసీసీ బృందాలే. అయినా ఇటీవల పర్చూరు నియోజకవర్గం పూనూరులో ఓ ఆటోకు ఫ్లెక్సీ ఉందని దానికి అనుమతులు ఉన్నాయోలేవో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆ వాహనాన్ని సీజ్ చేయాలని ఎంసీసీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనధికార ఆటోను గుర్తించి కూడా పక్కన పెట్టించకుండా వాహనాన్ని వదిలేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది అధికార పార్టీకి సంబంధించిన ఆటో కావడం వల్లే ఎంసీసీ బృందం దాన్ని ఆపకుండా మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల నుంచి ఎంసీసీ బృందాల వరకు అధికార వైకాపా వారి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో కూడా తెదేపా సానుభూతిపరుడి ఇంట్లో డబ్బుల కట్టలు ఉన్నాయని పోలీసులు వచ్చి హడావుడి చేశారు. విపక్షాలను అణగదొక్కటమే లక్ష్యంగా పోలీసులు తీరు ఉందని తెదేపా వర్గాలు ఆరోపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి