విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు.
జగన్ జమానాలో పింఛనర్ల జీవితాలు అతలాకుతలం
క్వాంటమ్ పింఛన్ మూడు శాతం తగ్గింపు
పెండింగ్లో డీఏలు.. రూ.లక్షల్లో నష్టం
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పింఛన్ 10, 12 తేదీల్లో పడుతోంది. ఓ నెలలో 15 వరకు రాలేదు. సకాలంలో పింఛన్ పడక ఆందోళకు గురై బీపీ, మధుమేహం సమస్యలు మరింత పెరిగాయి. నెలవారీ చెల్లింపులు సకాలంలో చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డీఏలు పెండింగ్లో పెట్టడటం, ఫిట్మెంట్లో కోత విధించటం వల్ల ఐదేళ్లలో రూ.లక్షన్నరకు పైగా నష్టపోయారు.
- విశ్రాంత ఉద్యోగి సుబ్బారావు పింఛన్ నుంచి ఆరోగ్య బీమా కింద ప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున మినహాయించుకుంటోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి హెల్త్కార్డు చూపిస్తే ఈ కార్డుతో వైద్యం చేయలేం. ముందుగా చెల్లించి తర్వాత ప్రభుత్వం నుంచి వైద్య బిల్లులు రీయింబర్స్మెంటు చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు. శస్త్రచికిత్స, వార్డులో ఉండి వైద్యం పొందినందుకు రూ.లక్షల్లో ఖర్చయింది. వైద్య బిల్లులకు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంటు మాత్రం ఇంకా రాలేదు. బిల్లు సొమ్ము ఎప్పుడు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.
బాపట్ల, న్యూస్టుడే: సీఎం వైఎస్ జగన్ పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితం దినదిన గండంగా మారింది. గతంలో ఠంచనుగా ఒకటో తేదీ పింఛన్ సొమ్ము అందేది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించేవారు. జగన్ గద్దె ఎక్కిన తర్వాత పింఛనర్లకు కష్టాల సుడిగుండాలు మొదలయ్యాయి. అసలు పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పింఛన్ నగదు పడక ఆందోళనకు గురై అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. కరవు భత్యం(డీఏ) కూడా ఒక్కసారే చెల్లించారు. రెండో డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ ఇవ్వలేదు. ఎనిమిది డీఏలు రాక ఒక్కో పింఛన్దారుడు రూ.లక్షల్లో నష్టపోయారు. సీఎం జగన్ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైకాపా పాలనలో మోసపోయామని పింఛన్దారులు తీవ్ర మనోవేద]నకు గురవుతున్నారు.
2019 నుంచి 2024 మధ్యకాలంలో..
- వైకాపా వచ్చాక, 2019లో సీఎం జగన్ 27 శాతం పీఆర్సీ అని చెప్పి మొదట ఆరు నెలలు మాత్రమే ఇచ్చి తర్వాత నుంచి 20 శాతం అని చెప్పి రివర్స్ పీఆర్సీ చేసి ఇస్తున్నారు.
- ప్రతీ నెలా ఒకటో తేదీన పింఛన్ రావడం అనేది ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. పదో తేదీ నుంచి 20 తేదీ మధ్యలో ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. చివరకు పింఛను సొమ్ము పడడమే మహాభాగ్యం అనుకునేలా చేశారు.
- 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకు 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు.
- 2018 జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 185 నెలల కరవు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ్ర
- 70 ఏళ్లలోపు పింఛనుదారులకు అదనపు భృతి ఇదివరకు 10 శాతం ఉండేది. ఇప్పుడు ఏడు శాతానికి కుదించారు. అలాగే 75 ఏళ్ల వారికి 15 శాతం ఉండేది. దీనిని 12 శాతానికి తగ్గించారు.
- పింఛనుదారులు చనిపోతే వారికి చెల్లించాల్సిన మట్టి ఖర్చులు గరిష్ఠంగా నెల పింఛను మంజూరు విధానాన్ని మార్చి, కేవలం రూ.25 వేలే చెల్లిస్తున్నారు.
- మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఈహెచ్ఎస్ కార్డులను నిర్వీర్యం చేశారు. ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్సలు చేయడం లేదు.
- డీఏలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా పింఛన్దారుల పింఛన్ సొమ్ము పెంచినట్లు చూపించి ఆదాయ పన్ను వసూలు చేయడం గమనార్హం.
రూ. మూడు లక్షలు నష్టపోయా
వైకాపా ప్రభుత్వ పాలనలో పింఛనర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. సకాలంలో పింఛన్ సొమ్ము చెల్లించడం లేదు. ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నాం. డీఏలు ఇవ్వకుండా మోసం చేశారు. కేవలం మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చారు. డీఏలు, ఫిట్మెంట్ రూపంలో ఐదేళ్లలో వ్యక్తిగతంగా నేను రూ.మూడు లక్షలు నష్టపోయా. హెల్త్కార్డు ఉన్నా అన్ని వ్యాధులకు వైద్యం చేయడం లేదు. మెడికల్ రీయింబర్స్మెంటు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
చెరుకూరి సుబ్బారావు, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు
క్వాంటమ్ పింఛన్ తగ్గించడం అన్యాయం
70 ఏళ్లు దాటిన పింఛన్దారులకు చెల్లించే క్వాంటమ్ పింఛన్ను పది శాతం నుంచి ఏడు శాతానికి ప్రభుత్వం తగ్గించింది. అదనంగా వచ్చే పింఛన్లో మూడు శాతం చొప్పున గత నాలుగేళ్లలో రూ.వేలల్లో నేను నష్టపోయా. పింఛన్ చెల్లింపులో బాగా జాప్యం చేయడం వల్ల రుణాల తాలూకూ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం.
జీవీ బ్రహ్మం, పింఛనర్ల సంఘం ఉపాధ్యక్షుడు
గత ప్రభుత్వ హయాంలో..
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక లోటును లెక్కచేయకుండా 43 శాతం ఫిట్మెంట్తో చంద్రబాబు పదో పీఆర్సీ ఇచ్చారు. జూన్ 2014 నుంచి మార్చి 2015 వరకు 10 నెలల పీఆర్సీ బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లు ఒకేసారి పింఛనుదారులు అందరికీ చెల్లించారు. విరమణ పొందే ఉద్యోగులకు రిటైర్మెంట్ తేదీకి 15 రోజుల ముందుగానే ట్రెజరీలో బిల్లుల చెల్లింపు కోసం అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేక జీవో తెచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ విరమణ రోజే పింఛను, గ్రాట్యూటీ, కమ్యూటేషన్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితరాలు ఉద్యోగులకు సకాలంలో అందించారు. ప్రతి నెలా 31వ తేదీ సాయంత్రం లేదా ఒకటో తేదీన పింఛను ఇచ్చేవారు.
వైకాపా హయాంలో పింఛను సొమ్ముకు కోత
డబ్భై ఏళ్లు దాటిన పింఛనర్లకు ఔషధాల కొనుగోలు, ఇతర అదనపు ఖర్చులు కలిపి అదనంగా పది శాతం క్వాంటమ్ పింఛన్, 75 ఏళ్లు నిండితే 15 శాతం క్వాంటమ్ పింఛన్ చెల్లించారు. క్వాంటమ్ పింఛన్ రూపంలో అదనంగా పింఛన్ సొమ్ము లభించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఖర్చుల భారం పడలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో క్వాంటమ్ పింఛన్కు కోతలు విధించారు. విశ్రాంత ఉద్యోగి రామారావుకు వయస్సు 74 ఏళ్లు. 70 ఏళ్లు దాటిన పింఛన్దారులు అనారోగ్య సమస్యలతో పెరుగుతున్న ఔషధాలు, ఇతర ఖర్చుల కింద అదనంగా పది శాతం క్వాంటమ్ పింఛన్ పొందేవారు. సీఎం జగన్ క్వాంటమ్ పింఛన్ను పది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. కానీ క్వాంటమ్ పింఛన్లో మూడు శాతం కోత విధించడం వల్ల నాలుగేళ్లలో రామారావు రూ.65 వేలు నష్టపోయాడు.
జిల్లాలో మొత్తం పింఛన్దారులు: 9,592 మంది
ప్రతి నెలా చెల్లిస్తున్న పింఛన్ సొమ్ము: రూ.39.76 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి