జీతాలకూ ఎదురుచూపులే..
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.
ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రతి నెలా ఇబ్బందులు
- జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.
- జిల్లా బీసీ కార్పొరేషన్ ఉద్యోగులకు గత ఏడాది 2023, అక్టోబరు నుంచి 2024, మార్చి నెల వరకు జీతాలు విడుదల కాలేదు. సిబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడడంతో జిల్లా అధికారి అందుబాటులో ఉన్న నిధుల నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు అడ్వాన్స్ కింద చెల్లించారు. వేతనాలు విడుదలైన తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి, ఉపాధి హామీ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు జమ కాలేదు.
జిల్లాపరిషత్తు (గుంటూరు), కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలలో ఒకటో తేదీన జీతం తీసుకున్న సందర్భాలు వేళ్ల మీద లెక్కించాల్సిందే. ఒకప్పుడు నెలలో ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగులకు జీతాలు వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏ నెలలో జీతం ఆ నెలలో వస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఓ క్రమబద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. నెలవారీ కుటుంబ ఖర్చులు, పిల్లల ఫీజులు ఇతరత్రా ఖర్చులను లెక్క వేసుకుని వ్యయం చేస్తుంటారు. అయిదేళ్లలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నెలలో 1న జీతాలు జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 5వ తేదీ తర్వాత వేస్తున్నారు. ఎక్కువ మందికి 10 నుంచి 20వ తేదీ లోపు విడుదల చేస్తుండటంతో బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అప్పులకు సంబంధించి నెల వారీ కిస్తీలు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు ఆయా తేదీల్లో చెల్లించకపోతే బ్యాంకులు అపరాధ రుసుం విధిస్తున్నాయి. దీనికితోడు రుణాత్మక పాయింట్లతో సిబిల్ స్కోర్ పడిపోయి భవిష్యత్తులో రుణాలు పొందడానికి అవరోధంగా మారుతోంది. పిల్లలుంటే.. పాఠశాల, కళాశాలల్లో టర్మ్ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో కుటుంబాల అవసరాలు తీర్చడానికి ప్రైవేటు వ్యక్తులు, సూక్ష్మ రుణ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. 1 నుంచి 5వ తేదీ లోపు జీతాలు వస్తే అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో కుటుంబాలను పోషించుకోవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
జాప్యంతో ఇక్కట్లు
మూడు నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తుండడంతో ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారు చేసేందుకు సరకులు సరఫరా చేసే వారికి నాలుగైదు నెలలకు బిల్లులు విడుదల చేస్తుండటంతో నిర్వహణ కష్టంగా మారింది. గురుకులాల్లో 13 ఏళ్లుగా పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోవడంతో వందలాది మంది నష్టపోయారు. కేవలం సొసైటీలు పరిధిలో పని చేస్తున్నామనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు అమలు చేయడం లేదు.
డి.మధుసూదనరావు, రాష్ట్ర గురుకులాల జేఏసీ ఛైర్మన్
సమస్యలు పరిష్కరించలేదు
సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు విడుదల చేయలేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు వర్తింపజేయకపోవడంతో వందల మంది నష్టపోయారు. ఒప్పంద ఉపాధ్యాయులు, అధ్యాపకులను 010 పద్దు నుంచి జీతాలు తీసుకోవడం లేదనే కారణంతో రెగ్యులర్ చేయకపోవడం బాధాకరం. విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి మాత్రం 62 ఏళ్లకు పెంచారు. పార్ట్ టైం టీజీటీలకు రూ.18 వేలు, పీజీటీలు, జేఎల్స్కు రూ.24 వేలు చెల్లిస్తున్నారు. 2019 నుంచి మెడికల్ అలవెన్స్ రూ.900 చెల్లించడం లేదు. మూడేళ్ల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రినిపల్స్ పదోన్నతులు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నారు. నివాసయోగ్యంగా లేని క్వార్టర్లకూ పూర్తి స్థాయి హెచ్ఆర్ఏ మినహాయించేలా ఉత్తర్వు తీసుకురావడంతో నష్టం జరుగుతుంది.
దాసరి ప్రభాకర్, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం