కీలక ఘట్టానికి వేళాయె
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి 25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ
ఈనాడు-అమరావతి, కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేస్తారు. ఈ నెల 21 ఆదివారం కావడంతో ఆ రోజు స్వీకరించరు. గుంటూరు పార్లమెంటు స్థానానికి జిల్లా కలెక్టరేట్లో, అసెంబ్లీలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ మధ్య నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు మరో నలుగురికి ఆర్వో ఛాంబర్లోకి అనుమతి ఉంటుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.25వేలు, అసెంబ్లీకి రూ.10వేల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దీనిలో సగం కడితే సరిపోతుంది. నామినేషన్ల దాఖలు గడువు పూర్తయిన తర్వాత ఈ నెల 26న వాటిని పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 29న సాయంత్రం 3గంటల తర్వాత అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు.
వంద మీటర్లలోకి అయిదుగురికే అనుమతి.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసే సమయంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి బలం చూపేలా మందీ మార్బలంతో నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివస్తారు. అయితే వారందరినీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల అవతలే నిలిపివేస్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్ అధికారి వద్దకు కేవలం అభ్యర్థితో పాటు అయిదుగురు సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. నామపత్రాల స్వీకరణకు సంబంధించి గతంలో ఉన్న ఫారం 26ను ప్రస్తుతం ఎన్నికల సంఘం మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో నూతన విధానంలోనే అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేయాల్సి ఉంది.
జిల్లాలో 17.87లక్షల ఓటర్లు.. జిల్లాలో ప్రస్తుతం 17.87 లక్షల మంది ఓటర్లున్నారు. వీరికి 1915 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర బలగాలను నియమిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుంది. ఎన్నికల విధుల్లో 13,800 మంది సిబ్బంది పాల్గొంటారు.
కీలకమైన తేదీలివే...
నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 18
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26
ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ మే 13
ఓట్ల లెక్కింపు, ఫలితాలు జూన్ 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి