logo

సీఎం ఇంటి సమీపంలో గంజాయి గుప్పు.. విక్రేతలను కట్టిపడేసిన స్థానికులు

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి విక్రేతలు పట్టుబడడం కలకలం రేపింది.

Published : 22 Apr 2024 07:50 IST

పట్టుబడిన యవకులు (అంతరచిత్రంలో గంజాయి)

తాడేపల్లి, న్యూస్‌టుడే: తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి విక్రేతలు పట్టుబడడం కలకలం రేపింది. ఇక్కడి నవోదయ కాలనీ వద్ద ఆదివారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు యువకులు గోతాములో గంజాయి పెట్టుకుని సంచరిస్తుండగా స్థానికులు ప్రశ్నించారు. వారిలో ఒకరు పరారవగా.. మిగిలిన ఇద్దరు ఎదురుతిరిగి దాడికి యత్నించారు. దీంతో స్థానికులంతా ఏకమై వారికి దేహశుద్ధి చేసి చేతులను తాళ్లతో కట్టేశారు. వారి వద్ద రెండు కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. హైసెక్యూరిటీ జోన్‌గా ఉన్న సీఎం క్యాంపు కార్యాలయ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. యువకులు ఎక్కడ నుంచి వచ్చారు? ఎంతమంది ఉన్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని