సైకిల్ దూకుడు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు
మరింత ముమ్మరం కానున్న ప్రచారాలు
ఈనాడు, అమరావతి
చంద్రబాబుతో ధూళిపాళ్ల, లోకేశ్, శ్రావణ్కుమార్, పెమ్మసాని, నసీర్, మాధవి, రామాంజనేయులు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇప్పటికే కొందరు నామపత్రాలు సమర్పించి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, భాజపా నేతలతో కలిసి ప్రజలను కలుసుకుని ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఆదివారం తెదేపా అధినేత ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫారాలను పార్టీ కార్యాలయంలో అందించి దిశా నిర్దేశం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీఫారాలు తీసుకున్నారు. ప్రచార ఒత్తిడి, ఇతర కార్యక్రమాలు ఉన్న ఇద్దరికి నేతల చేత బీఫారాలు అందించే ఏర్పాటు చేశారు. దీంతో అభ్యర్థులు మరింత ఉత్సాహంతో ప్రచారానికి సిద్ధమయ్యారు. నామినేషన్ దాఖలు చేసిన వారు ఇక పూర్తి స్థాయి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సోమవారం పలువురు అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే ప్రచారం ఊపందుకోనుంది. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు. ఈసారి అభ్యర్థుల ఖరారు, బీఫారాల పంపిణీ తదితర అంశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రణాళికాయుతంగా వ్యవహరించడం అభ్యర్థులకు కలిసొచ్చింది. ముందస్తుగా అభ్యర్థులను నిర్ణయించడం వల్ల ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను ఒకసారి కలుసుకుని తాము అందరికీ అందుబాటులో ఉంటామని, ఆదరించాలని కోరారు. ఇంకా 20 రోజులు ప్రచారం చేయడానికి సమయం ఉండడంతో వీలైనంత సమయం ప్రచారంలోనే ఉంటూ ప్రజల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రగతికి అమలు చేసే ప్రణాళికలను తెలియజేస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ఏయే వర్గాలు ఏమేరకు నష్టపోయాయో ప్రజలకు వివరించి ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో మూడు పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి