logo

సర్పంచి ఇంటిపై వైకాపా రౌడీమూక దాడి

బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది.

Published : 17 May 2024 04:45 IST

ధ్వంసమైన తెదేపా ప్రచార రథం అద్దం

బెల్లంకొండ, న్యూస్‌టుడే: బెల్లంకొండ మండలంలో వైకాపా రౌడీ మూక ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఎన్నికల ప్రచారం సమయంలోనే తెదేపా శ్రేణులను అడుగడుగునా అడ్డుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తాజాగా గురువారం రాత్రి మండల కేంద్రం బెల్లంకొండలోని తెదేపా ఎస్సీ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం ఇంటిపై దాడులకు తెగబడ్డారు. ఆ సమయంలో సర్పంచి కుటుంబ సభ్యులెవరూ లేకపోవడంతో ఇంటిపై రాళ్ల విసిరారు. అక్కడే ఉన్న తెదేపా ప్రచార రథాన్ని ద్వంసం చేశారు. దుర్భాషలాడుతూ అక్కడి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేశారు. మహిళలను అసభ్యకరంగా దూషించారు. స్థానికులు రౌడీ మూకను అడ్డుకుని, ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచి కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని