సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసిన ప్రభుత్వం
కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు.
సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు
మాట్లాడుతున్న చిలకలపూడి పాపారావు, పక్కన లలితకుమారి, సాంబశివరావు, జాస్తి వీరాంజనేయులు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: కేంద్రం నుంచి విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు రూ.998.84 కోట్లను పంచాయతీలకు జమ చేయాలని ఏపీ పంచాయతీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. గుంటూరులోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నా.. ప్రజలు ఇబ్బందులు చెబుతున్నా.. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులుగా తామేమీ చేయలేని స్థితిలో ఉన్నాం. కేంద్రం నుంచి నిధులు వచ్చి 45 రోజులు గడుస్తున్నా నేటికీ పంచాయతీలకు జమ చేయలేదు. ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా త్వరలో జమ చేస్తామని చెప్పినా ఫలితం లేదు. వేసవిలో తాగునీటి సమస్యకు నిధులు సమస్య తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన 5వ ఆర్థిక సంఘం నిధులను ఇంత వరకు విడుదల చేయకపోవడం దారుణం. ఈ ప్రభుత్వాన్ని జూన్ 4న ఇంటికి పంపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. సర్పంచులకు కనీసం నిధులు, విధులు లేకుండా చేసింది’.. అని ధ్వజమెత్తారు. అఖిల భారత పంచాయతీ పరిషత్తు(న్యూదిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ‘వైకాపా ప్రభుత్వం సర్పంచులకు నిధులు, విధులు లేకుండా చేసి ఉత్సవ విగ్రహాల్లాగా చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులంతా కలిసి అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేయకపోవడం దుర్మార్గం. గతంలో ఇదే విషయమై కేంద్రం కమిటీని రాష్ట్రానికి పంపితే అప్పుడు తప్పు జరిగిందని నివేదించారు. మళ్లీ ఆ తప్పు జరగదని చెప్పిన అధికారులు నేటికీ పంచాయతీలకు నిధులు జమ చేయలేదు. ఈ విషయంపై ఈసీ దృష్టి సారించి పంచాయతీలకు నిధులు విడుదల చేసేలా చూడాలి. గ్రామ ప్రజలు ఓటుతో ఎన్నుకున్న సర్పంచులకు గౌరవ వేతనం రూ.3 వేలుంటే, ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనం ఉంది. అత్యంత తక్కువ గౌరవ వేతనాన్ని సర్పంచులకు ఇవ్వడం దారుణం’.. అని మండిపడ్డారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చందు వెంకట సాంబశివరావు, వెంగళాయపాలెం సర్పంచి నల్లపాటి లలితకుమారి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?