కేసుల్లో ఇరికించి.. చితకబాదారు
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు.
జీజీహెచ్లో మాచవరం తెదేపా కార్యకర్తల ఆవేదన
ఈనాడు-అమరావతి
మాచవరం మండలంలో పోలింగ్ అనంతరం మరుసటి రోజు జరిగిన గొడవల్లో తమను పోలీసులు కేసులు ఇరికించారని, దారుణంగా కొట్టారని తెదేపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14న మాచవరం ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా గాయపరిచారు. నిందితుల్ని శుక్రవారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచగా పోలీసులు తమను కొట్టారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారికి వైద్య పరీక్షలు చేయించి నివేదిక అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించడంతో బాధితులను జీజీహెచ్కు తీసుకొచ్చారు. తమను అన్యాయంగా కేసుల్లో ఇరికించి చితకబాదారని బాధితులు శుక్రవారం జీజీహెచ్లో మీడియాతో వాపోయారు.
ఓటేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చా..
కొత్తగణేషునిపాడులో రాజకీయ పార్టీల మధ్య గొడవ జరిగిందని కుటుంబ సభ్యులు తెలుసుకుని స్వగ్రామంలో ఉంటే రక్షణ ఉండదని, సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. దీంతో ద్విచక్రవాహనంపై బయటకు వెళుతుంటే బైపాస్ రోడ్డులో నిర్బంధించి పోలీసులు కొట్టారు.
పి.నిఖిల్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, మోర్జంపాడు
దారుణంగా హింసించారు
తెదేపా సానుభూతిపరుడిని అనే ఏకైక ఉద్దేశంతోనే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈనెల 14న మాచవరంలో జరిగిన గొడవల్లో పాల్గొనలేదు. అయినా నన్ను పోలీసులు పట్టుకెళ్లి చితకబాదారు. రెండు కాళ్లు పంగచీల్చి తొడలపై మరో కానిస్టేబుల్ నిలబడగా ఇంకో కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేకపోయా. మమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు వైద్యులపై గాయాలు కాలేదని నివేదిక ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
శ్రీకాంత్, రైతు, మోర్జంపాడు
ఆసుపత్రికి వెళుతుంటే లాక్కెళ్లారు
మా పెద్దనాన్న మోహన్రావుకు అనారోగ్యంగా ఉంటే 14న ఆసుపత్రికి తీసుకువెళ్తున్నా. అదే సమయంలో పోలీసులు జాతీయ రహదారిలో నన్ను అడ్డగించి వారి వెంట తీసుకెళ్లారు. దీంతో మా పెద్దనాన్న ఒక్కరే అనారోగ్యంతో ఉండి బైకు మీద ఇంటికి వెళ్లిపోయారు. పెద్దనాన్నకు గుండెనొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగివస్తానని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులు కొట్టిన దెబ్బలకు నడవలేకపోయాను.
టి.రమేష్, మోర్జంపాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్