ఎవరిపై వేటు పడుతుందో..
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఎన్నికల సంఘం చర్యలతో అధికారుల్లో కలవరం
సిట్ ఏర్పాటుతో సమగ్ర దర్యాప్తు
ఈనాడు-నరసరావుపేట
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురిపై వేటు వేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. మరోవైపు సిట్ ఏర్పాటు చేసి ప్రతి సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజు జరిగిన దాడులు, అనంతరం చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేస్తే మరింత మంది పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ను బదిలీ చేయడం, ఎస్పీతోపాటు ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలపై వేటు పడింది. ఒక్క జిల్లాలోనే ఎనిమిది మందిపై ఎన్నికల సంఘం ఒకేసారి చర్యలు తీసుకోవడంతోపాటు విచారణకు ఆదేశించడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవడానికి గల కారణాలు, పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై చర్చ మొదలైంది. జిల్లా యంత్రాంగంలో శుక్రవారం అధికారుల వేటుపైనే చర్చ జరిగింది. ఇంకా ఎవరెవరిపై చర్యలు తీసుకుంటారోనన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. శుక్రవారం సిట్ ఏర్పాటు చేయడంతోపాటు శనివారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ఆయా ఉద్యోగుల్లో కలవరపాటు మొదలైంది.
పల్నాట కట్టుదిట్టమైన భద్రత
పల్నాడు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామాల్లో తనిఖీలు చేసి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంతోపాటు బయటి వ్యక్తులు జిల్లాలో లేకుండా జల్లెడ పట్టారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠత్రిపాఠి ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల వరుస తనిఖీలు, బలగాల కవాతు, నిరంతరం గస్తీతో పల్నాడు జిల్లాలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. నివురు గప్పిన నిప్పులా ఉన్న పట్టణాల్లో మాత్రం కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. అయితే సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరింత సమయం పట్టనుంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలెట్టింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని లెక్కింపు రోజు మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ఘటనలు చోటుచేసుకుండా చూడాలన్నా లక్ష్యంతో భద్రతకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉంటూ సహకరించాలని అధికారులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి బాధ్యులను గుర్తించి వారిని అరెస్టు చేస్తున్నారు. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో ఇతర అంశాలపై పోలీసుశాఖ దృష్టిసారించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం