పట్టణాల్లోనూ ఓటరు పోటెత్తారు!
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు.
75 శాతానికిపైగా నమోదైన పోలింగ్
2019తో పోలిస్తే పెరిగిన వైనం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
సాధారణంగా పట్టణాల్లో నివసించేవారికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి గంటలకొద్దీ వేచి ఉండి ఓటేసే సహనం ఉండదు. అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చినవారు పట్టణాల్లో స్థిరపడతారు. ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదు? అనేది గ్రహించరని, తమను ఓటేయమని ఎవరూ అడగరని ఓటేయడానికి నిర్లక్ష్యం వహిస్తారు. అంతేకాకుండా సెలవు వచ్చిందని సినిమానో, ఇంట్లో టీవీ చూస్తూనో కాలక్షేపం చేస్తారు. అలాంటిది ఈసారి పుర ప్రజల్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాల్లో ఈసారి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులుదీరారు. దీంతో నరసరావుపేట మినహా అన్నిచోట్లా 75 శాతంపైగా నమోదైంది.
మొదటి నుంచి గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతుంది. ప్రతి ఎన్నికలోనూ ఇదే మాదిరి కనిపిస్తుంది. ఈసారి కూడా గ్రామాల కంటే పట్టణాల్లో పోలింగ్ శాతం తక్కువే ఉన్నా.. 2019 ఎన్నికల పోలింగ్తో పోలిస్తే మాత్రం పట్టణ ప్రాంతాల్లో పెరుగుదల కనిపించడం విశేషం. పట్టణాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడంతో ఆయా పార్టీలు గెలుపోటములపై బేరీజులు వేసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పెరగడం వల్లే ఓటర్లు ఓపిగ్గా వరుసలో ఉండి తమకే ఓటేశారని కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెరగడం తమకు లాభిస్తుందని వివరిస్తున్నారు. అన్నిచోట్లా రెండు నుంచి మూడు శాతం పోలింగ్ అధికంగా నమోదు కావడం చూస్తే అన్నిచోట్లా మంచి ఫలితాలు వస్తాయని కూటమి నేతలు చెబుతున్నారు.
ఒక్క నరసరావుపేటలోనే తక్కువ నమోదు
జిల్లాలో అన్ని పురపాలక సంఘాలతో పోల్చి చూస్తే నరసరావుపేటలో తక్కువ పోలింగ్ నమోదైంది. 73.23 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నరసరావుపేటలో మొత్తం ఓటర్లు 1,04,768 మందికి 76721 మంది మాత్రమే ఓటు వేశారు. ఇంకా ముప్పై వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. నరసరావుపేట వాసులు అధికంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాల్లో ఉద్యోగం, చదువుల నిమిత్తం వలస వెళ్లారు. వారంతా ఓటేయడానికి రాలేదు. అందుకే పోలింగ్ తక్కువగా నమోదైందని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పెరుగుదల కనిపిస్తుంది. నరసరావుపేట కంటే మిగతా పట్టణాలు ఓటింగ్లో చాలా మెరుగ్గా ఉన్నాయి. వినుకొండ పట్టణంలో అత్యధికంగా 83 శాతం మంది ఓటర్లు ఓటేశారు. వినుకొండ తర్వాత సత్తెనపల్లిలో 81 శాతం, నరసరావుపేటలో 2019తో పోలిస్తే 1 శాతం పోలింగ్ పెరిగింది. చిలకలూరిపేటలో కూడా 2 శాతం ఓటింగ్ పెరిగింది. సత్తెనపల్లిలో ఒక శాతం, వినుకొండలో భారీగా 3 శాతం, పిడుగురాళ్లలో 3 శాతం, మాచర్ల 1 శాతం పోలింగ్ అధికంగా నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?