దయచేసి వినండి.. ధరలు అధికం
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు.
రైల్వేస్టేషన్లో అందినకాడికి దోపిడీ
గుంటూరు రైల్వే , న్యూస్టుడే
గుంటూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకుని గుత్తేదారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మంచినీరు, బిస్కెట్లు, శీతల పానీయాల అమ్మకాల్లో గరిష్ఠ అమ్మకం ధర కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ప్రయాణికులు ప్రశ్నించినా ఎమ్మార్పీకి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. వారితో వాదనలకు దిగేందుకు సమయం లేనందున అధిక ధరలకు కొనుగోలు చేయక తప్పడంలేదు. దీనిపై పత్రికల్లో వార్తలు ప్రచురితమైతే రైల్వే అధికారులు దాడులు చేసి జరిమానా విధిస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు దాని గురించి మరచిపోతారు. నిరంతర పర్యవేక్షణ లేనందున కాంట్రాక్టర్లు తమకు తోచిన విధంగా ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తుం డటం సర్వసాధారణమైంది. రాత్రి సమయాల్లో ధరలు మరింత పెంచి అమ్ముతుండటం గమనార్హం. వేసవిలో ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. అందువల్ల నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
స్టేషన్లో దుకాణాలు నిత్యం వేలల్లో ప్రయాణికులు
గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం వేలాది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్కువ రైళ్లు అతి కొద్ది నిమిషాలు మాత్రమే స్టేషన్లో ఆగుతాయి. ఆ సమయంలో బోగీ నుంచి దిగి స్టేషన్లో ఉన్న కుళాయి వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవడం కష్టంగానే ఉంటుంది. దీంతో ఎక్కువ మంది తాము కూర్చున్న సీటు వద్దకే వచ్చి తాగునీరు అమ్మే సీసాలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్నే అవకాశంగా భావించిన కాంట్రాక్టర్లు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుని మంచినీరు, శీతల పానీయాలు అమ్మకాలు చేస్తున్నారు.
స్టేషన్లో దుకాణాలు
అనుమతులు పక్కదారి
రైల్వే స్టేషన్లో స్టాల్స్ పెట్టుకునేందుకు అనుమతి తీసుకున్న గుత్తేదారు వెండింగ్ పర్మిట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆ కార్డును ఉదయం ఒకరు, సాయంత్రం ఒకరు వినియోగిస్తుండటం గమనార్హం. ఫుడ్ ప్లాజాలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు స్టేషన్ ఆవరణలోనే అమ్మాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా రహదారి పక్కన తయారుచేసే పదార్థాలు స్టేషన్లో అమ్ముతుండటం గమనార్హం.
ఎంఆర్పీకి ఇవ్వలేదు
తాగునీటి సీసాపై ధర రూ.15 ఉంది. అయినప్పటికీ రూ.20 ఇవ్వాల్సిందేనని చెప్పారు. దీంతో చేసేది లేక కొనుగోలు చేయాల్సి వచ్చింది. గుంటూరు రైల్వే స్టేషన్లో రైలు దిగి కుళాయి వద్దకు వెళ్లి తాగి రావాలంటే అప్పటి వరకు రైలు ఆగుతుందో లేదో అని భయం. అందువల్లే బోగీ వరకూ వచ్చి అమ్ముతున్నవారి నుంచే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించాలి.
అంకమ్మరావు, ప్రయాణికుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు