వర్షం పలకరింపు.. పుడమి పులకరింపు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది.
ఈనాడు-అమరావతి
వడ్డమాను గ్రామంలో దుక్కిదున్ని సాగుకు సిద్ధం చేసిన పొలం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. మూడు నెలలుగా మండుటెండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం రాకతో ఉపశమనం కలిగింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభం కాలేదు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకోవడానికి అత్యంత అనుకూలమని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు సాగు చేసుకుంటే ప్రధాన పంటలు సాగు చేసే సమయానికి ఏపుగా పెరిగిన వాటిని భూమిలో కలియదున్నితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది.
గుంటూరులో 21.5 మి.మీ..
శుక్రవారం తెల్లవారుజాము నుంచి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం పడింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు గుంటూరు జిల్లాలో సగటున 21.5 మిల్లీమీటర్లు నమోదుకాగా, బాపట్ల జిల్లాలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు జిల్లాలో చెదురుమదురుగా వర్షం పడింది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు వాతావరణ శాఖ వర్షం కొనసాగుతుందన్న సూచనలతో రైతులు పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
దుక్కులకు సిద్ధమవుతూ..
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొందరు పొలాలు శుభ్రం చేసుకునే పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలోని గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో రెండో పంట పూర్తి కావడంతో పొలాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాలకు పొలాలు బాగా తడిస్తే దుక్కులు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ వరి సాగు ఎక్కువగా వెద పద్ధతిలో చేపడుతున్నందున దుక్కులు సిద్ధం చేసుకుంటే ప్రాజెక్టుల్లోకి నీటి చేరిక ఆధారంగా జూన్ చివర లేదా జులై తొలి వారంలో వరి సాగు చేపడతారు. ఇందుకు అనుగుణంగా రైతులు పొలాలకు కౌలు ధరలు మాట్లాడుకోవడం వంటి పనులు మొదలయ్యాయి.
ఉక్కపోత నుంచి ఉపశమనం
ప్రధాన కాల్వల నుంచి పొలాల్లోకి వచ్చే పిల్ల కాలువలు బాగు చేసుకోవడం వంటి పనులు చేపడుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో పొలాల్లో మిరప, మొక్కజొన్న, పత్తి ఇతర పంటల వ్యర్థాలను శుభ్రం చేసుకుంటున్నారు. అడపాదడపా పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లిపెసర విత్తనాలు చల్లుకుంటున్నారు. మూడు నెలలుగా మండుటెండలతో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో భానుడు భగభగ మండగా ప్రజలు అల్లాడిపోయారు. ప్రస్తుతం కురుస్తున్న జల్లులతో వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం