ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులే లక్ష్యం
మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు.
సంబంధం లేని కేసుల్లో ఇరికించే యత్నం
తెదేపా మద్దతుదారులపై కక్ష సాధింపు
అమరావతి, న్యూస్టుడే: మాతృభూమిపై మమకారంతో ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎంతో వ్యయప్రయాసలు పడి ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులు సొంతూర్లకు వచ్చారు. వారంతా తెదేపాకు అనుకూలంగా ఓటు వేశారన్న అక్కసుతో వైకాపా నేతలు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. సంబంధం లేని గొడవల్లో ఇరికించి, కేసులు నమోదు చేయిస్తున్నారు. గ్రామాల్లో పోలింగ్, ఆతర్వాత రోజు జరిగిన వివాదాలు, ఘర్షణలకు సాకుగా చూపి, ఎన్ఆర్ఐలు, ఐటీ ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్ఆర్లు ఈసారి ఓటు వేయడానికి తరలివచ్చారు. కొందరు రాష్ట్ర అభివృధ్ధి కాంక్షిస్తూ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో వైకాపా నాయకులు కక్ష కట్టి ఇబ్బందులు పెడుతున్నారు.
- క్రోసూరు మండలం అనంతవరంలో ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాష్ తెదేపా తరపున ప్రచారం నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే సతీమణి తన అనుచరులతో గొడవ సృష్టించారు. ఆ గొడవను చూపి భానుప్రకాష్పై క్రోసూరు స్టేషన్లో కేసు నమోదు చేయించారు. పెదకూరపాడు మండలం హుస్సేన్నగరం గ్రామానికి చెందిన భానుప్రకాష్ కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
- అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన గుండవరపు అనిల్కుమార్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి వెంకట్రావు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను చూసేందుకు, అలాగే ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చారు. తండ్రితో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. గ్రామంలో జరిగిన గొడవతో అతనికి సంబంధం లేకపోయినా వైకాపా నేతల ఫిర్యాదులో కేసు నమోదు చేశారు.
- పెదకూరపాడు మండలం హుస్సేన్నగరంలో ఓ వైకాపా నేతపై దాడి ఘటనలో ఐటీ ఉద్యోగులపై కేసు నమోదు చేయడానికి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ గొడవకు సంబంధం లేకపోయినా ఐటీ ఉద్యోగులు తెదేపా తరపున ప్రచారం చేశారని కక్ష పెంచుకున్నారు.
గొడవలో ఇరికించారు
- అనిల్కుమార్, ఎన్ఆర్ఐ
ఎంతో ఖర్చు పెట్టుకుని ఓటు వేయడానికి సొంత ఊరికి వస్తే సంబంధంలేని గొడవలో ఇరికించారు. జన్మభూమి కోసం రావడమే మేం చేసినా తప్పా. కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. ఎన్ఆర్ఐలను మూల స్తంభాలుగా గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలే తప్ప.. ఇబ్బందులకు గురిచేయొద్దు.
సేవ చేసేందుకు వచ్చా
- మాగులూరి భానుప్రకాష్, ఎన్ఆర్ఐ
మాతృభూమికి సేవ చేద్దామని అంత దూరం నుంచి వచ్చాం. ఇప్పటికే 500 సేవా కార్యక్రమాలు చేశా. గొడవలతో సంబంధం లేకపోయినా కావాలనే కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రచారం చేశాం. ఎక్కడా వివాదాల జోలికి వెళ్లలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి