దేవుడి భూమి.. సమర్పయామి
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నవగ్రహాలయ సర్వీసు మాన్యం
విక్రయించి సొమ్ము చేసుకున్న అర్చకులు
నిలిచిపోయిన ధూపదీప నైవేద్యాలు
అమరేశ్వరాలయంలో ఇదీ సంగతి
ఈనాడు, న్యూస్టుడే - అమరావతి
అమరావతిలోని అమరేశ్వరాలయంలో నవగ్రహ మండపంలోని విగ్రహాలు
దేవుడికి సేవ చేయాల్సిన అర్చకులు ఆలయ భూమినే అమ్మేశారు. నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాల కోసం దాతలిచ్చిన భూమిని అమ్మేసి నిత్య కైంకర్యాలు నిలిపేశారు. వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. ఇదీ అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయంలోని నవగ్రహాలయం భూముల వ్యవహారం. భక్తులు టికెట్ కొనుగోలు చేయగా వచ్చిన ఆదాయంతోనే పూజలు చేయాల్సిన పరిస్థితి.
పంచారామాలలో ప్రథమారామం అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం. 1940లో గుబ్బా శ్రీరాములు అనే భక్తుడు వెంకటాద్రినాయుడి మండపంలో నవగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ కైంకర్యాలకయ్యే మొత్తాన్ని అర్చకులకు ఇచ్చి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. తన తదనంతరం కూడా ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందుల్లేకుండా ఉండాలన్న సదాశయంతో నవగ్రహాలయానికి అమరావతి రెవెన్యూ పరిధిలో రెండెకరాల భూమిని 1955లో అప్పటి అర్చకులైన శంకరమంచి చినపుల్లయ్యకు దానపత్రం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమి ద్వారా వచ్చే ఫలసాయంతో నవగ్రహ మండపంలోని స్వాములకు నిత్యనైవేద్య ధూపదీప కైంకర్యాలు నిర్వహించగా మిగిలిన సొమ్మును అర్చకస్వాములు అనుభవించాలని దానపత్రంలో పేర్కొన్నారు. ఒకవేళ కైంకర్యాలు నిర్వహించకపోతే ఆ భూమిని తిరిగి తీసుకునే హక్కును తన వారసులకు ఇస్తున్నట్టు కూడా దాత స్పష్టంగా రాశారు. తాకట్టుపెట్టడంగానీ, విక్రయించడానికిగానీ ఎలాంటి హక్కులు లేవని కూడా పేర్కొన్నారు. నవగ్రహాలను 1980 పుష్కరాల సమయంలో ఆలయంలోని రెండవ ప్రాకారంలో ఆంజనేయస్వామి ఉపాలయం వద్ద ప్రతిష్ఠించారు. అర్చకుల వారసులు కైంకర్యాలను చేస్తూ వచ్చారు.
దాత ఆశయం మరిచి విక్రయం
నవ్యాంధ్ర రాజధానిని తుళ్లూరు మండలంలో ఏర్పాటు చేయడంతో పక్కనే ఉన్న అమరావతిలో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో దాత ఇచ్చిన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించిన అర్చకులు గుట్టుచప్పుడు కాకుండా 2020 జులైలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. అప్పట్లో ఇక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ. కోటి వరకు ఉంది. అర్చకులు మాత్రం లక్షల రూపాయలకే కట్టబెట్టి వచ్చిన డబ్బును పంచేసుకున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ భూమి విలువ రూ. 29 లక్షలుగా ఉంది. గత నాలుగేళ్లుగా నవగ్రహాలకు ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. శనివారం రోజున ఎవరైనా శని పూజ చేయించుకుంటే తప్ప గేట్లు కూడా తెరవని పరిస్థితి నెలకొంది.
అధికారులు ఏం చేశారు?
నవగ్రహాల కైంకర్యాల కోసం దాత ఇచ్చిన భూమిని దేవాదాయశాఖ రికార్డుల్లో నమోదు చేసి కాపాడాల్సిన ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఆలయాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి విక్రయాలు జరగకుండా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా అమలు చేయడంలో విఫలమయ్యారు. సర్వీసు మాన్యం, ఇతర భూములు, ఆస్తులను పర్యవేక్షిస్తూ రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సిన ఈవోల అలసత్వం వల్ల రూ. కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైంది. నాలుగేళ్ల కిందట విక్రయం జరిగినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆలయ ఈవో వేమూరి గోపిని వివరణ కోరగా భూములను విక్రయించిన విషయం తమ దృష్టికి రావడంతో విచారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టి ఆలయ ఆస్తుల రికార్డుల్లో నమోదు చేశామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి