logo

గ్రానైట్‌ ముడిరాయి లారీల పట్టివేత

గుంటూరు విజిలెన్స్‌ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

Published : 21 May 2024 04:06 IST

బల్లికురవ, సంతమాగులూరు, న్యూస్‌టుడే: గుంటూరు విజిలెన్స్‌ సీఐ శ్రీహరి తన బృందంతో సోమవారం బల్లికురవ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మల్లాయపాలెం సమీపంలోని ఈర్లకొండ గ్రానైట్‌ క్వారీల నుంచి ముడిరాయి తరలిస్తున్న రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. వాటిలోని బిల్లులను పరిశీలించగా ఒక లారీపై తరలిస్తున్న ముడిరాయికి బిల్లులు లేకుండా ఉన్నట్లు గుర్తించారు. మరో లారీపై ఉన్న ముడిరాయికి బిల్లులోని కొలతకు భారీగా తేడాలు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతర వాటిని బల్లికురవ పోలీసులకు అప్పగించారు. సంతమాగులూరు మండలం గురిజేపల్లి సమీపంలోని క్వారీ నుంచి ముడిరాయి తరలిస్తున్న మరో లారీని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటికీ కొలతల ఆధారంగా జరిమానా విధించనున్నట్లు సీఐ చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని