జాతీయ సేవకుల కోసం
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్.
సన్, కేవీఆర్ సంస్థల ఆధ్వర్యంలో ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సు
నవభారత్నగర్(గుంటూరు), న్యూస్టుడే
జాతీయ స్థాయిలో సామాన్యులకు సేవలందించే ఆవకాశం సివిల్ సర్వీసెస్ ద్వారా కలుగుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ వైపు ఆసక్తి చూపేందుకు అవసరమైన కృషి చేస్తున్నాయి గుంటూరులోని స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్(సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. వాటి సంయుక్త ఆధ్వర్యంలో 2014 నుంచి పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచితంగా పదిరోజులపాటు ఐఏఎస్ ఫౌండేషన్ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు.
నేటి నుంచి ప్రారంభం
గుంటూరు బ్రాడీపేట 2/6లో యూటీఎఫ్ కార్యాలయంలో ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తారు. 8వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్నవారు హాజరు కావచ్చు. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. వివరాలకు 72075 66702, 63094 81514, 81435 29978, 8688 97406 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవచ్చు. సివిల్ సర్వీస్ పరీక్షతోపాటు గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు కావాల్సిన అర్హలతోపాటు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో ఈ పది రోజుల శిక్షణలో విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు.
పాఠశాల విద్యార్థులే లక్ష్యం
- కె.ఎస్.లక్ష్మణరావు, ఎమ్మెల్సీ, పోటీ పరీక్షల నిపుణులు
వెనుకబడిన రాష్ట్రాలుగా చెబుతున్న ఒడిశా, బిహార్ నుంచి జాతీయ స్థాయి పరీక్షలకు ఎక్కువ మంది హాజరుకావడమే కాకుండా ఎక్కువ మంది ఎంపికవుతున్నారు. మన రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది విజేతలుగా నిలుస్తున్నారు. దీనికి కారణం కెరీర్ ఆప్షన్ చాలా పరిమితంగా ఉండటమే. పాఠశాల స్థాయికి చెందిన 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 2014 నుంచి (2020,21 తప్ప) ఈ ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులను నిర్వహిస్తున్నాం. సిలబస్ విశ్లేషణతోపాటు నిత్యం వార్తా పత్రికలు, ఎన్సీఈఆర్టీ పుస్తకాలను క్షుణ్నంగా చదివే అలవాటు చేయడమే మా లక్ష్యం.
నా ప్రయాణం ఇక్కడి నుంచే...
- కొండా యుగకీర్తి, ఎంపీడీవో, ప్రకాశం జిల్లా
సన్లో 2015లో వాలంటీర్గా చేరాను. ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులకు హాజయ్యాను. పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో శిక్షణ ద్వారా అర్థమైంది. ఒకవైపు వాలంటీర్గా సేవలు అందిస్తూనే ఈ శిక్షణ తరగతులకు వెళ్లాను. విజ్ఞాన్ నిరుల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేసి, ఆ స్ఫూర్తితో గ్రూప్-1 (2018) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపీˆడీవోగా ఎంపికయ్యాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?