దేవదాయశాఖ భూమి అన్యాక్రాంతం
గోరంట్లలోని సీతారాములస్వామి గుడికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైంది.
నల్లపాడు పోలీసులకుఫిర్యాదు చేసిన గ్రామస్థులు
అధికారుల ఎదుటే ఆక్రమణదారుల హల్చల్
గుంటూరు రూరల్, న్యూస్టుడే: గోరంట్లలోని సీతారాములస్వామి గుడికి సంబంధించిన భూమి అన్యాక్రాంతమైంది. గుంటూరు రూరల్ మండల పరిధిలోని గోరంట్లలో దేవాదాయ శాఖకు చెందిన రూ.30 కోట్ల విలువైన భూమిని అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 53-1లో 93.5 సెంట్లు భూమికి ఆక్రమణదారులు తప్పుడు నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 800 గజాలు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గ్రామస్థులు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేయడంతో దేవదాయ శాఖ అధికారులు మంగళవారం గోరంట్లలో విచారణకు వెళ్లారు. భూమిని పరిశీలిస్తుండగా ఆక్రమించిన వ్యక్తులు అక్కడకు వచ్చి వీరంగం సృష్టించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వరరెడ్డి ఎదుట ఆక్రమణదారులు రెచ్చిపోయారు. ఫిర్యాదు చేసిన వారిపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. అధికారుల ఎదుటే ఫిర్యాదు చేసిన వారిని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్థులు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్టేషన్ సీఐ బత్తుల శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫిర్యాదు వస్తే విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి