పోలీసుల ఉదాసీనతతోనే హత్యాయత్నం: జీవీ
గతంలో బాలకోటిరెడ్డిపై కత్తులతో దాడి జరిగినపుడు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరాం.. మళ్లీ దాడి చేశారు.. దీనికి పోలీసుల ఉదాసీనతే కారణమని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
ఆసుపత్రిలో బాలకోటిరెడ్డిని పరామర్శిస్తున్న జీవీ ఆంజనేయులు, డాక్టర్ అరవిందబాబు
నరసరావుపేట అర్బన్, న్యూస్టుడే: గతంలో బాలకోటిరెడ్డిపై కత్తులతో దాడి జరిగినపుడు పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కల్పించాలని కోరాం.. మళ్లీ దాడి చేశారు.. దీనికి పోలీసుల ఉదాసీనతే కారణమని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. రొంపిచర్ల మండలం అలవాలలో ఇటీవల కాల్పులకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న వెన్నా బాలకోటిరెడ్డిని శనివారం జీవీ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాకుల సంస్కృతిని తెచ్చారని మండిపడ్డారు. గతంలో బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, ఈ క్రమంలోనే వైకాపా నేతల ప్రమేయంతో నిందితులు కాల్పులకు తెగబడ్డారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో 17 హత్యలు, 200లకు పైగా దాడులు జరిగాయన్నారు. వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసులు వారికి వంత పాడుతున్నారన్నారు. కాల్పుల ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే తెదేపా నాయకులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. నేతల వెంట కుమ్మెత కోటిరెడ్డి, కొట్టా కిరణ్, తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోడ్ ఉన్నా.. అంబటికి లేనట్లే!
[ 28-03-2024]
ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. -
ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం : కలెక్టర్
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రాధాన్యం ఇచ్చి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. -
‘వైకాపాకు ఓటేస్తే అభివృద్ధిని అడ్డుకున్నట్లే’
[ 28-03-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని తాడికొండ నియోజకవర్గం తెదేపా మహిళా అధ్యక్షురాలు మైని గిరిజ పేర్కొన్నారు. -
‘వైకాపా నుంచి విముక్తికి ఎదురుచూస్తున్న ప్రజలు’
[ 28-03-2024]
వైకాపా ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గుంటూరు పార్లమెంట్ తెదేపా ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
[ 28-03-2024]
పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు -
పట్టుతప్పితే.. ప్రాణాలు గల్లంతే
[ 28-03-2024]
దారుణంగా దెబ్బతిన్న రహదారి. పాదచారులే ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన చోట ఇక వాహనదారుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఎదురుగా ద్విచక్ర వాహనం వచ్చినా దిక్కుతోచని స్థితి వాహనదారులది -
నిధులు దోచేయ్
[ 28-03-2024]
అద్దంకి నియోజకవర్గంలోని ఓ మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతివాటం ప్రదర్శించి, అధికార వైకాపా నాయకుల అండదండలతో పనులు చేయకుండా భారీగా బిల్లులు మింగేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. -
ఆగని వాలంటీర్ల ప్రచారం
[ 28-03-2024]
పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం ఎంతచెప్పినా పలు గ్రామాల్లో వాలంటీర్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. -
మరో 52 మంది వాలంటీర్ల తొలగింపు
[ 28-03-2024]
ఈనెల 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు -
ఆర్టీసీ నగరబాట హామీ.. నగుబాటేనోయి!
[ 28-03-2024]
గుంటూరు నగరంలో 11 లక్షల మంది నివసిస్తున్నారు. రోజు వారీగా లక్ష మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. 159 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నగరం విస్తరించింది -
నేతలకు లబ్డబ్బు
[ 28-03-2024]
ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనవరి నెల నుంచి ఎన్నికల సందడి మొదలైంది. టికెట్ల ఖరారు కాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. -
లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది
[ 28-03-2024]
జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!