2 రూ.కోట్లుక్యాసినో ఆడేశాడు!
సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది
రైతుల కష్టంతో వ్యాపారి జూదం
బల్లికురవ, న్యూస్టుడే: సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది క్రితం గ్రామం వదిలేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం పోలీసులకు చిక్కగా విషయం బయటపడింది. మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్ కొంతకాలంగా గ్రామంలో మొక్కజొన్నలు, ధాన్యం ఇతర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేసి కాకినాడకు చెందిన వ్యాపారికి ఎగుమతి చేస్తుండేవాడు. ఇదే తరహాలో గత ఏడాది ఆ గ్రామానికి చెందిన రైతుల నుంచి పంటలను కొన్నాడు. తొలుత కర్షకులకు క్రమం తప్పకుండా నగదు ఇవ్వడంతో అందరూ నమ్మి ఎక్కువ మొత్తంలో అతనికే పండించిన పంటను అమ్మేశారు. కొన్ని రోజులు గడిచిన తరువాత నగదు కోసం రైతులు వ్యాపారిపై ఒత్తిడి చేశారు. మిల్లరు నగదు ఇవ్వలేదంటూ సమాధానం చెప్పుకొంటూ వచ్చేడు. చివరకు కర్షకులు నేరుగా మిల్లర్లను సంప్రదిస్తే విడదల వారీగా నగదును ఆ వ్యాపారి సూచించిన ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఆందోళన చెందిన రైతులు ప్రదీప్ ఇంటికి చేరుకున్నారు. వారి రాకను పసిగట్టిన వ్యాపారి గత ఏడాది ఆగస్టులో గ్రామం విడిచి వెళ్లిపోయాడు. పోలీసులకు అతని ఆచూకీ మంగళవారం తెలియడంతో స్టేషన్కు తరలించారు.
నా దగ్గర చిల్లిగవ్వలేదు..
వ్యాపారి.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం పెద్ద ఎత్తున బల్లికురవ స్టేషన్కు చేరుకుని అతడిని విచారించారు. నా దగ్గర చిల్లిగవ్వ లేదు.. ఉన్న నగదు అంతా ఆన్లైన్ల్లో క్యాసినో ఆడాను.. వస్తాయని ఆశతో ముందు కొంచెం పెట్టుబడి పెట్టాను.. తిరిగి రాకపోవడంతో మరికొంత వెచ్చించాను. అలా విడతల వారీగా క్యాసినో ఆడటంతో మొత్తం పోయాయని బదులిచ్చాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రైతులు మా నగదుతో నీకు జూదం ఎలా ఆడాలనిపించిందంటూ వాపోయారు. పోలీసులు మాత్రం అతని బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు జరిగిన తీరు తెలుసుకునేందుకు ఆయా బ్యాంకు మేనేజర్లకు లేఖ రాశారు. ఏది ఏమైనప్పటికీ ఓ వ్యాపారి జూదానికి బానిసై సుమారు 70మంది రైతులు మరో పది మంది దాచుకునేందుకు ఇచ్చిన నగదు పూర్తిగా ఆన్లైన్లో పోగొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు రూ.2, 3, 4, 5లక్షల వరకు ఇచ్చినవారు ఉన్నారు. చాలా మంది పిల్లల చదువుల కోసం, మరి కొందరు పెళ్లిళ్లు చేయడం కోసం దాచుకున్నామని బోరున విలపిస్తున్నారు. సాగుకు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలని ఇంకొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట