2 రూ.కోట్లుక్యాసినో ఆడేశాడు!
సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది
రైతుల కష్టంతో వ్యాపారి జూదం
బల్లికురవ, న్యూస్టుడే: సుమారు రూ.2 కోట్లు.. 70 మంది రైతుల కష్టం.. ఓ వ్యాపారికి జూదం సరదా.. వెరసి మొత్తం నగదు అంతర్జాలంలో క్యాసినో ఆడి పోగొట్టేశాడు.. రైతులకు తిరిగి డబ్బు ఇవ్వలేక ఏడాది క్రితం గ్రామం వదిలేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల క్రితం పోలీసులకు చిక్కగా విషయం బయటపడింది. మండలంలోని కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన ప్రదీప్ కొంతకాలంగా గ్రామంలో మొక్కజొన్నలు, ధాన్యం ఇతర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేసి కాకినాడకు చెందిన వ్యాపారికి ఎగుమతి చేస్తుండేవాడు. ఇదే తరహాలో గత ఏడాది ఆ గ్రామానికి చెందిన రైతుల నుంచి పంటలను కొన్నాడు. తొలుత కర్షకులకు క్రమం తప్పకుండా నగదు ఇవ్వడంతో అందరూ నమ్మి ఎక్కువ మొత్తంలో అతనికే పండించిన పంటను అమ్మేశారు. కొన్ని రోజులు గడిచిన తరువాత నగదు కోసం రైతులు వ్యాపారిపై ఒత్తిడి చేశారు. మిల్లరు నగదు ఇవ్వలేదంటూ సమాధానం చెప్పుకొంటూ వచ్చేడు. చివరకు కర్షకులు నేరుగా మిల్లర్లను సంప్రదిస్తే విడదల వారీగా నగదును ఆ వ్యాపారి సూచించిన ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఆందోళన చెందిన రైతులు ప్రదీప్ ఇంటికి చేరుకున్నారు. వారి రాకను పసిగట్టిన వ్యాపారి గత ఏడాది ఆగస్టులో గ్రామం విడిచి వెళ్లిపోయాడు. పోలీసులకు అతని ఆచూకీ మంగళవారం తెలియడంతో స్టేషన్కు తరలించారు.
నా దగ్గర చిల్లిగవ్వలేదు..
వ్యాపారి.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న సమాచారం తెలుసుకున్న రైతులు బుధవారం పెద్ద ఎత్తున బల్లికురవ స్టేషన్కు చేరుకుని అతడిని విచారించారు. నా దగ్గర చిల్లిగవ్వ లేదు.. ఉన్న నగదు అంతా ఆన్లైన్ల్లో క్యాసినో ఆడాను.. వస్తాయని ఆశతో ముందు కొంచెం పెట్టుబడి పెట్టాను.. తిరిగి రాకపోవడంతో మరికొంత వెచ్చించాను. అలా విడతల వారీగా క్యాసినో ఆడటంతో మొత్తం పోయాయని బదులిచ్చాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన రైతులు మా నగదుతో నీకు జూదం ఎలా ఆడాలనిపించిందంటూ వాపోయారు. పోలీసులు మాత్రం అతని బ్యాంకు ఖాతాల వివరాలు, లావాదేవీలు జరిగిన తీరు తెలుసుకునేందుకు ఆయా బ్యాంకు మేనేజర్లకు లేఖ రాశారు. ఏది ఏమైనప్పటికీ ఓ వ్యాపారి జూదానికి బానిసై సుమారు 70మంది రైతులు మరో పది మంది దాచుకునేందుకు ఇచ్చిన నగదు పూర్తిగా ఆన్లైన్లో పోగొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిలో కొందరు రూ.2, 3, 4, 5లక్షల వరకు ఇచ్చినవారు ఉన్నారు. చాలా మంది పిల్లల చదువుల కోసం, మరి కొందరు పెళ్లిళ్లు చేయడం కోసం దాచుకున్నామని బోరున విలపిస్తున్నారు. సాగుకు అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలని ఇంకొందరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు: నారా లోకేశ్
[ 25-04-2024]
ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతలను రాజధాని రైతులు నిలదీయాలని యువనేత, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. -
చదువులమ్మ చెట్టుకు.. రాజకీయ చెద!
[ 25-04-2024]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న పురాతన విద్యాసంస్థల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఒకటి. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతినార్జించిన ఘనత దీని సొంతం. దాదాపు పది, పదిహేను దేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకునేవారు. -
యూజీడీ మూలన.. మాటలు మరుగున
[ 25-04-2024]
నా ముస్లింలు.. నా మైనార్టీలు అంటూ మాటలతో మభ్యపెట్టడమే గానీ సీఎం జగన్కు వారిపై ఏమాత్రం ప్రేమలేదని చెప్పడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తికాని ఉదంతమే నిదర్శనం. -
నాడు వాతలుండవని కోతలు.. నేడు ఛార్జీల మోతలు
[ 25-04-2024]
ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రమంతా తిరిగి చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయని విమర్శించారు. తాను అధికారంలోకి వచ్చాక విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీనిచ్చారు. -
అభిమాన నీరాజనం
[ 25-04-2024]
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నామినేషన్ సందర్భంగా బుధవారం తెనాలిలో నిర్వహించిన ప్రదర్శనకు ప్రజలు భారీగా తరలివచ్చారు. -
పసుపుమయమైన రేపల్లె
[ 25-04-2024]
రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు కార్యక్రమం బుధవారం కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. -
అక్రమంగా తవ్వారు.. ప్రాణాలు తీస్తున్నారు!
[ 25-04-2024]
రెండేళ్ల కిందట ప్రత్తిపాడుకు చెందిన నలుగురు కళాశాల విద్యార్థులు ఈతకు బోయపాలెంలోని డైట్ సమీపంలో క్వారీ గుంత వద్దకు వెళ్లారు. -
చందా.. దందా
[ 25-04-2024]
ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. -
మిత్ర ద్రోహం
[ 25-04-2024]
పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాల మిత్రలకు నెలకు రూ.16 వేల గౌరవవేతనం ఇస్తామని హామీ ఇచ్చి గత అయిదేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచకుండా తమని సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని గోపాల మిత్రలు వాపోతున్నారు. -
‘పది’లో ‘ప్రత్యేక’ విజయం
[ 25-04-2024]
అమ్మ ప్రోత్సాహం..అమ్మమ్మ పర్యవేక్షణ..భవిత కేంద్ర టీచర్ల కృషి...ప్రధానోపాధ్యాయురాలి తోడ్పాటు వెరసి 16 ఏళ్ల దివ్యాంగురాలైన జి.శ్రావ్య జోసెఫిన్ పదో తరగతి పూర్తిచేసింది. -
తెదేపా ప్రచార వాహన డ్రైవర్పై వైకాపా దాడి
[ 25-04-2024]
తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. -
ప్రజల గొంతూ తడపలేరా?
[ 25-04-2024]
2018 మార్చి 14వ తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి పొన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో పొన్నూరు పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాజీనామా చేయకుంటే అంతుచూస్తాం
[ 25-04-2024]
వాలంటీర్లుగా మీకు ప్రతి ఇంట్లో ఎంత మంది ఓటర్లున్నారు..ఎటు అనుకూలంగా ఉన్నారో తెలుసు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 25-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో