ఆన్లైన్ లావాదేవీలతో అవస్థలు
పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా..
ఖాతాలో జమైన నగదు కట్ అవుతుందంటున్న కార్యదర్శులు
పంచాయతీ కార్యాలయం వద్ద ఆన్లైన్ పేమెంట్లు చేయాలని పెట్టిన ప్రచార పత్రాలు
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే : పంచాయతీల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్, యూపీఐ విధానంలో పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే క్షేత్ర స్థాయిలో బ్యాంకుల నుంచి క్యూఆర్, యూపీఐ గుర్తింపు సంఖ్యలు రాకపోవడంతో అక్టోబర్ నెలలో నెమ్మదిగా సేవలు మొదలయ్యాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు యూపీఐ విధానంలో ప్రజల నుంచి పేమెంట్ చేస్తుంటే పంచాయతీ/సచివాలయ కార్యదర్శులు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో 236 గ్రామాన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జిల్లాలో అన్ని గ్రామాల్లోనూ యూనియన్ బ్యాంకులో పంచాయతీ తరఫున ప్రభుత్వ ఖాతాను తెరచారు. యూపీఐ పేమెంట్స్కు అనుకూలంగా ఉండేలా ఈపోస్ యంత్రం, క్యూఆర్ కోడ్లు ఆలస్యంగా అయినా పంచాయతీలకు చేరాయి. తీరా యూపీఐ పేమెంట్స్ మొదలుపెట్టిన తర్వాత ఖాతాలో జమైన నగదులో కొంత సొమ్ము ఖాతాలో నుంచి కట్ అవుతుంది. కనిష్ఠంగా రూ.50 నుంచి గరిష్ఠంగా ఇప్పటి వరకు రూ.350 వరకు కట్ అయిన సందర్భాలున్నాయి. రూ.5 వేలకు పైబడి పేమెంట్స్ చేసిన చోట్ల ఒక్కొసారి రూ.300 వరకు కట్ అవుతున్నాయని, మరికొన్ని చోట్ల రూ.40, రూ.50 తగ్గిపోతున్నాయి. దీంతో యూపీఐ ద్వారా పన్నులు కట్టించుకోవాలంటే పంచాయతీ అధికారులు, ఉద్యోగులు జంకుతున్నారు. దీనికితోడు ప్రజలు చెల్లించిన డబ్బులను ఖజానా శాఖ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శి బ్యాంకుకు వెళ్లి పంచాయతీ ఖాతాలోని నగదును ఖజానా శాఖ ఖాతాకు జమ చేయాలని విత్డ్రా చేద్దామన్నా.. అందుకు ఖాతాలో నుంచి డబ్బులు తీసుకుందామన్నా డబ్బులు రావడం లేదని కొందరు కార్యదర్శులు వాపోతున్నారు.
ఈపోస్, క్యూఆర్ కోడ్లతో చెల్లింపులు
డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు క్యూఆర్ కోడ్లను బ్యాంకుల ద్వారా అందించారు. అయితే మూడు వేల మంది జనాభా పైబడిన గ్రామాలకు క్యూఆర్ కోడ్తో పాటుగా ఈపోస్ యంత్రాలను సైతం అందుబాటులో ఉంచారు. తద్వారా ఏటీఎం కార్డులను వినియోగించి కూడా పంచాయతీకి చెల్లింపులు చేసే వెసులుబాటుంది.
సాంకేతిక సమస్యలు పరిష్కరించుకుంటున్నాం
జిల్లాలోని అన్ని గ్రామాలకు క్యూఆర్ కోడ్స్ అందాయి. ఇప్పుడిప్పుడే పంచాయతీ కార్యదర్శులు కొన్ని సాంకేతిక సమస్యలను తమ దృస్టికి తీసుకొస్తున్నారు. వాటిని క్రమంగా పరిష్కరిస్తున్నాం. మొదట్లో క్యూఆర్ కోడ్స్ వినియోగించుకున్నందుకు కొన్నిచోట్ల కమిషన్ కింద నగదును ఖాతా నుంచి కట్ చేశారు. తర్వాత వాటిని బ్యాంకర్లతో మాట్లాడి వెనక్కి తెప్పించుకున్నాం. సాంకేతిక సమస్యలను ఒక్కొక్క దానిని పరిష్కరిస్తున్నాం. మున్ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ పేమెంట్స్ జరిగేలా చర్యలు తీసుకుంటాం.
కె.శ్రీదేవి, జిల్లా పంచాయతీ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్