జగన్ కేసుల మాఫీకి రాష్ట్ర ప్రయోజనాలు మోదీకి తాకట్టు
జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
చలో దిల్లీ పోస్టర్ను ఆవిష్కరించిన నారాయణ, ఐకాస, వివిధ పార్టీల నాయకులు
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: జగన్.. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గుంటూరులోని ఎన్టీఓ కల్యాణ మండపానికి ఆదివారం రాత్రి విచ్చేసిన ఆయన ప్రత్యేక హోదా విద్యార్థి, యువజన, ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు షేక్ జిలాని నేతృత్వంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో జరిగే చలో దిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నరేంద్ర మోదీని సీఎం జగన్ లెక్కలేనన్ని సార్లు కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు గురించి ప్రస్తావన తీసుకొచ్చే ధైర్యం లేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు, వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీల కోసం పోరాడే తెగువ లేదు. ఆంధ్రుల విరోధి మోదీ. ఇతర రాష్ట్రాలపై ఉన్న ప్రేమ ఆయనకు ఆంధ్రప్రదేశ్పై ఏమాత్రం లేదు. ప్రజా ప్రయోజనాలు మరచిపోయి ప్రజాస్వామ్య విలువలను కాలరాసిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు ఓడించారు. అదేవిధంగా జగన్ను కూడా ఓడిస్తారు’.. అని పేర్కొన్నారు. దిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూనె పవన్తేజ, సీపీఐ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు