పిల్లలకిచ్చే మందుల్లో... ఎందుకీ కోత?
చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు.
అంగన్వాడీ కేంద్రాల్లో కనిపించని ఆల్ బెండజోల్, మరికొన్ని మందులు
పాత, కొత్త కిట్లలో స్పష్టంగా కనిపిస్తున్న మందుల వ్యత్యాసం
చల్లావారిపాలెం(వట్టిచెరుకూరు) : చిన్నారులకు పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేస్తూ.. పేద కుటుంబాల పిల్లలు, తల్లులు, గర్భిణులకు పోషకాహారం, ప్రాథమిక వైద్య సహాయం అందించేందుకు నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో మందుల కొరత ఏర్పడింది. ఐసీడీఎస్ విభాగం సమకూరుస్తున్న కిట్లలో సాధారణంగా ఇస్తున్న మందులను తగ్గించి పంపిణీ చేశారు. దీంతో పిల్లల ఆరోగ్య సంరక్షణ ఎలా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
12 రకాలకు ఏడే సరఫరా...
జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే ఐసీడీఎస్ మందుల కిట్లలో మందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో పెద్ద సైజు కిట్లలో పిల్లలు, తల్లులు, బాలింతలకు ఉపయోగకరంగా ఉండే 12 రకాల మందులను ప్రభుత్వం సరఫరా చేసింది. తాజాగా ఇచ్చిన కిట్లలో కేవలం ఏడు రకాల మందులే ఉంటున్నాయి. వీటిలోనూ అత్యంత కీలకమైన ఆల్బెండాజోల్, నియోమైసిన్ మందులు అసలు లేవు. కొత్తగా ఇస్తున్న ఓఆర్ఎస్ ప్యాకెట్ల సంఖ్య గణనీయంగా పెంచారు. గజ్జి, తామర, విరేచనాలు తగ్గించే మందులు లేవు. వాతావరణ మార్పుల కారణంగా రోగాలు ప్రబలే ప్రస్తుత సమయంలో మందులు అందుబాటులో ఉండకపోతే తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఇవ్వాలి..
జిల్లా వ్యాప్తంగా ప్రత్తిపాడు, ఫిరంగిపురం, తెనాలి, మంగళగిరి, పొన్నూరు ఐసీడీఎస్ సెక్టార్లు, గుంటూరు నగరం కలిపి మొత్తం 1,480 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గుంటూరు, పొన్నూరు, మంగళగిరి, తెనాలి వంటి పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో 50 నుంచి 90 వరకు చిన్నారులు ఉంటుండగా, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, తాడికొండ, ఫిరంగిపురం తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల్లో పది మంది కన్నా తక్కువ పిల్లలున్న పరిస్థితులూ ఉన్నాయి. అయితే అన్ని కేంద్రాలకూ సమాన సంఖ్యలో కిట్లు పంపిణీ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మందులు సరఫరా చేయాలని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇవే కిట్లు ఇస్తున్నారు...
- సుజాతాదేవి, ప్రత్తిపాడు సీడీపీవో ఐసీడీఎస్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటినే అందుబాటులో ఉంచాం. మందుల సంఖ్యను ఎందుకు తగ్గించారో తెలియదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
-
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు మృతి
-
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్