అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి
మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు.
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, పక్కన ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, జేసీ రాజకుమారి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: మిగ్జాం తుపాను పట్ల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో సోమవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తీరప్రాంతం లేకపోయినా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్లలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, గాలులు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీయవచ్చన్నారు. ప్రజలతో పాటు జంతువులకూ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు ప్రవహించే ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పట్టణాల్లో హోర్డింగ్లు, చెట్లు పడిపోయేలా ఉంటే.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్తంభాలు కూలినా.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్తు సరఫరా చేసేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ, విద్యుత్తు, ఆర్అండ్బీ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైవేల్లో ప్రయాణాలు సజావుగా సాగేలా సంచార బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో రైతులు వరి కోతలు కోయకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. వరద వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే.. వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేర్చాలని, అవసరమైన తాగునీరు, ఆహారం, మందులు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో పార్కులు, రిక్రియేషన్ ప్రాంతాలను మూసివేయాలన్నారు. వరదల వల్ల ఎక్కడైనా ముంపు పరిస్థితులు ఎదురైతే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను సంప్రదించవచ్చన్నారు. సమీక్షలో ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, జేసీ జి.రాజకుమారి, డిప్యూటీ కలెక్టర్ కె.స్వాతి, విపత్తు నిర్వహణ సంస్థ డీపీఎం లక్ష్మీకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం