దంత వైద్య విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం..
రూ.6 వేల జరిమానా
నిందితుడు జ్ఞానేశ్వర్
పెదకాకాని, న్యూస్టుడే : వివాహానికి నిరాకరించిందనే కక్షతో దంత వైద్య విద్యార్థినిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సోమవారం తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామానికి చెందిన మన్నే జ్ఞానేశ్వర్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి నవంబర్ 2020లో సామాజిక మాధ్యమం ద్వారా చిన అవుటపల్లి సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదువుతూ హాస్టల్లో ఉంటున్న తపస్వి పరిచయం అయ్యారు. ఆమె తల్లిదండ్రులు ముంబయిలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండేవారు. వారి పరిచయం ప్రేమగా మారడంతో మార్చి 2021లో జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.
తరువాత ఇద్దరూ గన్నవరంలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలం ఉన్నారు. కొన్నాళ్లకు తపస్విని అనుమానించడం ప్రారంభించడంతో గది ఖాళీ చేసి తక్కెళ్లపాడులో నివాసం ఉంటున్న బాల్య స్నేహితురాలు, దంత వైద్య విద్యార్థిని వద్దకు వెళ్లింది. అక్కడ నుంచి తరచూ కళాశాలకు వెళ్లి వస్తుండేది. నవంబర్, 2022లో జ్ఞానేశ్వర్ తపస్వి వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే చంపుతానని బెదిరించాడు. దీనిపై నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని మందలించి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు సైతం యువతికి ఇప్పించారు. ఈ క్రమంలో డిసెంబర్ 5న కత్తి, సర్జికల్ బ్లేడులు కొని తన ద్విచక్ర వాహనంపై తపస్వి నివాసం ఉంటున్న తక్కెళ్లపాడులోని ఇంటి వద్దకు వెళ్లాడు.
పెళ్లి చేసుకోవాలని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో కత్తి, సర్జికల్ బ్లేడులతో ఆమె శరీరంపై ఇష్టానుసారం పొడిచాడు. అనంతరం తానూ కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పక్క గదిలో ఉన్న స్నేహితురాలు బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేసిన సీఐ బండారు సురేష్బాబుతో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న సుల్తాన్ సిరాజుద్దీన్ నిందితుడి నేరం రుజువు చేసి శిక్ష పడేలా వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత