క్షణ క్షణం ఉత్కంఠ!
తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు.
నిజాంపట్నంలో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక
పునరావాసం, సహాయక చర్యలపై యంత్రాంగం దృష్టి
నిజాంపట్నం హార్బర్లో ఎగరేసిన పదో నంబరు ప్రమాద సూచిక
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే, నిజాంపట్నం, చినగంజాం : తుపానుహెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. నిజాంపట్నం వద్ద పదో నంబరు సూచిక జారీ చేయటంతో ప్రజలు మరింత అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో ఉమ్మడి జిల్లాల పరిధిలో సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సహాయక చర్యలు ముమ్మరం చేయటానికి ఆయా శాఖలను రంగంలోకి దించారు. ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, అగ్నిమాపక, పౌరసరఫరాలశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. తీరం దాటే సమయంలో మూడు జిల్లాల పరిధిలో విస్తారంగా వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని యంత్రాంగం భావిస్తోంది. అధిక వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం.. గాలులకు స్తంభాలు, హోర్డింగ్లు పడిపోవటం, విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించటానికి, సహాయక, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు మూడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆదేశించారు. సోమవారం ఉదయం నుంచి ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ కిందిస్ధాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుపాను సహాయక చర్యలు.. ఏర్పాట్లను పర్యవేక్షించటానికి, యంత్రాంగాన్ని సమన్వయం చేయటానికి సీనియర్ ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ను ప్రభుత్వం బాపట్లకు ప్రత్యేకాధికారిగా పంపింది. బాపట్ల సూర్యలంక కేంద్రం వద్ద సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఆప్రదేశాన్ని అక్కడి కలెక్టర్ రంజిత్బాషా, ఎస్పీ వకుల్జిందాల్లు పర్యటించి పరిశీలించారు.
పునరావాస కేంద్రాలివీ
దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చెరుకుపల్లి, రేపల్లె, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, చినగంజాం మండలాల్లో తుపాను ప్రభావం బాగా ఉంటుందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పల్లపు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిజాంపట్నం మండలం కొత్తపాలెం. నక్షత్రనగర్, సంజీవనగర్, దిండి, అడవులదీవి, పెనుమూడి, చెన్నుపల్లివారిపాలెం, అడవీదిపాలెం, చినగంజాం, పెదగంజాం, పాతూరు, చీరాల మండలం కటారిపాలెంలో పునరావాస కేంద్రాలకు ఇప్పటికే 800 మందికి పైగా జనాల్ని చేర్చామని రెవెన్యూవర్గాలు పేర్కొన్నాయి. తుపాను బలహీనపడే వరకు వారికి ఈ కేంద్రాల్లోనే ఆహారం, తాగునీటి, విశ్రాంతి సౌకర్యం కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు