పంట నష్టం అంచనా వేస్తున్నాం
మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ పి.రంజిత్బాషా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలసి ఆయన పాల్గొన్నారు.
ముందస్తు చర్యలతో తప్పిన ప్రాణనష్టం
ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్ రంజిత్బాషా
బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్టుడే: మిగ్జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ పి.రంజిత్బాషా ముఖ్యమంత్రి జగన్కు వివరించారు తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఎస్పీ వకుల్ జిందాల్, సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్తో కలసి ఆయన పాల్గొన్నారు. జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో ప్రాణనష్టం నివారించామన్నారు. జిల్లాలో 25 మండలాల్లో వర్షం కురిసిందని, 20 సెం.మీ వర్షపాతం నమోదైందన్నారు. రెండు చోట్ల గోడలు కూలి నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయని, 32 ఇళ్లు దెబ్బతిన్నాయని, 37 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. 350 విద్యుత్తు స్తంభాలు నేలవాలాయని, ప్రస్తుతం 90శాతం విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించామన్నారు. పర్చూరు సబ్స్టేషన్ దెబ్బతినడంతో సరఫరా నిలిచిపోయిందన్నారు. యుద్ధప్రాతిపదికన అక్కడ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దెబ్బతిన్న పంటలు: జిల్లాలో 70వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగింది. పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందు కోసం ఉపాధి కూలీలను వినియోగిస్తామన్నారు. ప్రతి మండలానికి పొక్లెయిన్, జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు. ఇందుకు రూ.25లక్షలు నిధులు ఇచ్చామన్నారు. జిల్లాలో అత్యధికంగా పండే వరి, శనగ, అరటి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటనష్టం అంచనాల సర్వే మొదలైనట్లు ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. కారంచేడు, మార్టూరు, పర్చూరు మండలాల్లో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు.
గ్రామాల్లో వైద్యశిబిరాలు
తీర ప్రాంతంలో వలలు, బోట్లు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే జిల్లాలో 93 వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. గేదెలకు అంటువ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు. తుపాను నష్టంపై మూడ్రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు.
1319 మందికి ఆశ్రయం
జిల్లాలో 74 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1,319 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. అత్యధికంగా బాపట్ల మండలంలో సూర్యలంక, వాడరేవు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళుతున్న వారికి ప్రభుత్వం నిర్దేశించిన వస్తువుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం