సీఆర్డీఏ నుంచి రాజధాని రైతులకు మళ్లీ నోటీసులు
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని,
సమస్యాత్మక ప్లాట్లు రద్దు చేసుకోవాలని అధికారుల ఫోన్లు
తుళ్లూరు, న్యూస్టుడే: రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తామని సీఆర్డీఏ నుంచి మళ్లీ రైతులకు నోటీసులు అందుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఉన్నట్టుండి వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని, సమస్యాత్మకంగా అనిపించిన ప్లాట్లు రద్దు చేసుకోవాలని కోరుతూ నోటీసులు పంపడంపై అమరావతి రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులు ఇప్పటికే ఒకసారి నోటీసులు ఇచ్చారు. రైతుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.
ఏం జరిగిందంటే...
రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు లాటరీ విధానంలో గత ప్రభుత్వం నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో కొంత మంది రైతులు భూ సేకరణకు విముఖత చూపారు. దీంతో అమరావతి బృహత్ ప్రణాళికకు ఆటంకాలు ఏర్పడకుండా అప్పట్లో ప్రభుత్వం వారి భూములను భూ సేకరణ(లాండ్ పూలింగ్) ద్వారా సమకూర్చే ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత వైకాపా అధికారంలోకి వచ్చింది. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో రైతులు తమ పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సాధ్యం కాలేదు. దీంతో తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏ అధికారులను రైతులు సంప్రదించారు. నాలుగున్నరేళ్లుగా వారి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో సమస్యాత్మక ప్లాట్లు రద్దు చేసుకోవాలని కోరుతూ నోటీసులు పంపడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైతులకు ఫోన్లు చేసి మరీ నోటీసుల గురించి అడగడం, ఆఖరి సారిగా పంపుతున్నామని, 15 రోజులోగా వివరణ ఇవ్వాలని పేర్కొనడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారు... ఎప్పటిలోగా ఇస్తారు... తదితర అంశాలపై తమతో చర్చించకుండా అత్యవసరంగా ప్లాట్లు రద్దు చేసుకోవాలని నోటీసులు ఇవ్వడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలపై రాతపూర్వకంగా సీఆర్డీఏ అధికారులు హామీ ఇచ్చిన తరువాతనే రైతులు అధికారులకు సమాధానాలు ఇవ్వాలని అమరావతి ఐకాస నాయకులు సూచిస్తున్నారు. దీనిపై సందేహాలు ఉన్న రైతులు అమరావతి ఐకాస కార్యాలయంలో సహకారం తీసుకోవాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.