అంధకారంలో పల్లెలు.. అందని విద్యుత్తు వెలుగులు
తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బాపట్ల (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్టుడే: తుపాను ప్రభావంతో జిల్లాలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. అనేక చోట్ల చెట్లకొమ్మలు విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. బుధవారం కూడా అనేక ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు 48 గంటల పాటు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు నిర్వహించామని విద్యుత్తు శాఖాధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రం బాపట్ల పట్టణంలో బుధవారం మధ్యాహ్నానికి 20శాతం ప్రాంతానికి సరఫరా లేదు. పల్లెల్లో 30శాతం వరకు విద్యుత్తు సరఫరా అందాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 596 గ్రామాల్లో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగింది. వీటిలో దాదాపు 180 గ్రామాలకు పైగా విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాల్సి ఉంది. విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం తుపాను వల్ల జిల్లా వ్యాప్తంగా 500 విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. 30కి.మీ మేర విద్యుత్తు తీగలు తెగిపోయాయి. మొత్తంగా 80 ట్రాన్స్ఫార్మర్లు పనికి రాకుండా పోయాయి. వీటి స్థానంలో బుధవారం రాత్రికి పూర్తిగా కొత్తవాటిని ఏర్పాటు చేసి గురువారం నాటికి జిల్లా వ్యాప్తంగా ఒక్క గ్రామం కూడా చీకట్లో లేకుండా విద్యుత్తు సరఫరా చేస్తామని విద్యుత్తు శాఖ ఈఈ ఆంజనేయులు తెలిపారు. చెరుకుపల్లి మండలలో గుళ్లపల్లి, పొన్నపల్లి, ఆరేపల్లి ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరించినా హెచ్చుతగ్గుల వల్ల తరచూ అంతరాయం కలిగింది. బలుసులపాలెం, తుమ్మలపాలెం, మోరవాగుపాలెంలో పూర్తిగా అంధకారం నెలకొంది. శివారు గ్రామాలు, కాలనీలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 95చోట్ల విద్యుత్తు సరఫరా లేక చీకట్లోనే ఉన్నాయి. ప్రజలు దోమలు, పాములతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు