‘అధికారుల నిర్ణయంతో లక్షల మంది రోడ్డున పడ్డారు’
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా లక్షమంది ల్యాబ్ టెక్నీషీయన్ల, పరోక్షంగా మరో రెండు లక్షల మంది రోడ్డున పడ్డారని జిల్లా ల్యాబ్, ఎక్స్రే ఓనర్స్ అషోసియేషన్ అధ్యక్షుడు ఆనం సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి రజినికి వినతిపత్రం అందజేస్తున్న సంజీవరెడ్డి, మూర్తి, శ్రీహరి తదితరులు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా లక్షమంది ల్యాబ్ టెక్నీషీయన్ల, పరోక్షంగా మరో రెండు లక్షల మంది రోడ్డున పడ్డారని జిల్లా ల్యాబ్, ఎక్స్రే ఓనర్స్ అషోసియేషన్ అధ్యక్షుడు ఆనం సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోకాన్-2024 పేరుతో గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్లో శనివారం రాత్రి జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రతి ల్యాబ్లో పెథాలజిస్ట్ ఉండాలనే నిబంధనతో వైద్యాధికారులు తమను వేధిస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో ఓ న్యాయస్థానంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా మన రాష్ట్రంలోనూ తమను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి మాట్లాడుతూ బేసిక్ పరీక్షల నిర్వహణ కోసమే తాము లైసెన్స్లు తీసుకున్నామన్నారు. ఈ పరీక్షలను కూడా నూరుశాతం కచ్చితత్వంతో ఇచ్చే యంత్రాలను వాడుతున్నామన్నారు. అందువల్ల తాము నిర్వహించే ల్యాబ్ల్లో ఇచ్చే నివేదికలతో రోగులకు ఇబ్బంది ఉండదన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తమ సమస్యలపై మంత్రి రజినికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో విజయలక్ష్మి, ఆ సంఘం జిల్లా కార్యదర్శి శ్రీహరి, వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్