logo

తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చి..తిరిగి రాని లోకాలకు..

గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన దేసు ధనలక్ష్మి (60) ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చి గుండెపోటుతో శనివారం మృతిచెందారు.

Published : 25 Feb 2024 05:06 IST

దుకాణం మెట్లపై ఒరిగి

చనిపోయిన దేసు ధనలక్షి

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటకు చెందిన దేసు ధనలక్ష్మి (60) ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లకు వచ్చి గుండెపోటుతో శనివారం మృతిచెందారు. శుక్రవారమే పెనుగంచిప్రోలు వచ్చిన ఆమె రాత్రి జరిగిన కల్యాణాన్ని వీక్షించి ఉదయాన్నే అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి పయనమయ్యారు. బస్సు కోసమని పోలీస్‌స్టేషన్‌ కూడలికి వచ్చి అక్కడే ఉన్న మిఠాయి దుకాణం మెట్లపై కూర్చున్నారు. కూర్చున్నట్లుగానే ఒక్కసారిగా మెట్లపై ఒరిగిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న  సెల్‌ఫోన్‌, బ్యాంకు పాస్‌బుక్‌ ఆధారంగా చిరునామా గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారని, ఆ క్రమంలోనే మృతి చెంది ఉంటారని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు లేనందున పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని