ఎయిమ్స్లో ఏర్పాట్ల పరిశీలన
మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు.
ఈనాడు-అమరావతి: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్న సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, గుంటూరు జిల్లా యంత్రాంగం, పోలీసులతో కలిసి ఎయిమ్స్ను సందర్శించారు. తొలుత స్థానికంగా ఉన్న పరిపాలనా భవనంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని అది ముగిసేవరకు ఉన్నతాధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం సభావేదికను ఆయన పరిశీలించారు. గుంటూరు, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి విద్యార్థులను పిలిపించటానికి బస్సులు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులు, ఆహ్వానితులు నిర్దేశిత సమయం కన్నా చాలా ముందుగా సభా ప్రాంగణానికి చేరుకునేలా చూడాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇద్దరు కేంద్రమంత్రులు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో వారికి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. బందోబస్తు నిర్వహణకు పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తదితరులు పాల్గొంటారని తెలిపారు. సమీక్షలో ఏపీఎంఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, కమిషనర్ జె.నివాస్, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ డైరెక్టర్ నిధి కేసర్వాని, ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ డాక్టర్ మధబానందకర్, డాక్టర్ దుంపల వెంకట రవికిరణ్, కల్నల్ శశికాంత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ థామస్, ఇతర వైద్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!