విద్యార్థులపై ఉపాధ్యాయుడి దాష్టీకం
వీపంతా ఎర్రగా వాతలు పడేలా కొట్టేంత తప్పు మా పిల్లలు ఏం చేశారంటూ సంజీయ్యనగర్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు.
వాతలు తేలేలా దెబ్బలు.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన
సుకన్యరాజ్కు వీపుపై వాతలు
నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్టుడే: వీపంతా ఎర్రగా వాతలు పడేలా కొట్టేంత తప్పు మా పిల్లలు ఏం చేశారంటూ సంజీయ్యనగర్ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఒకటో తరగతి చదువుతున్న సుకన్యరాజ్, జోసఫ్రాజ్ అనే విద్యార్థులను ఉపాధ్యాయుడు పి.లక్ష్మీనారాయణ మధ్యాహ్నం వీపుపై వాతలు పొంగేలా కొట్టారు. విద్యార్థులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఇళ్లకు వెళ్లిన తర్వాత పిల్లలకు జ్వరం వచ్చింది.
పాఠశాల వద్ద ఉపాధ్యాయులను నిలదీస్తున్న విద్యార్థుల బంధువులు
వారి నాయనమ్మ పిల్లలను పిలిచి కారణం అడగడంతో ఉపాధ్యాయుడు కొట్టిన విషయం చెప్పారు. వెంటనే ఆమె పిల్లల వీపుపై పొంగిన వాతలు చూసి కంగారుపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాఠశాలకు వద్దకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు ప్రభూజీని కలిసి వివరణ కోరారు. కొట్టిన ఉపాధ్యాయుడు అప్పటికే ఇంటికి వెళ్లి పోవడంతో పిలిపించాలంటూ ఆందోళనకు దిగారు. గంటన్నర తర్వాత వచ్చిన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణపై విద్యార్థుల బంధువులు, స్థానికులు ఆగ్రహంతో దాడికి యత్నించడంతో ఇతర ఉపాధ్యాయులు పక్కకు లాక్కొని వెళ్లారు. తాను చేసింది తప్పేనని, విద్యార్థులు తరగతి గదిలో బూతులు మాట్లాడుతుండడంతో కొట్టానని, ఇంతలా వాతలు పొంగుతాయని అనుకోలేదని ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ఆందోళనదారులకు చెప్పినా వినిపించుకోలేదు. సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి 7.30 గంటల వరకు సాగింది. విషయం తెలుసుకున్న ఎంఈవో వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడికి ఫోన్ చేసి తల్లిదండ్రులు ఆందోళన విరమించేలా నచ్చజెప్పాలని సూచించారు. ఘటనపై డీఈవో శైలజ దృష్టికి తీసుకెళతానని ‘న్యూస్టుడే’కు తెలిపారు. కొట్టిన ఉపాధ్యాయుడిని పిలిచి విచారించిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు