Crime News: గ్రాము బంగారం రూ.100.. నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ మోసం
గ్రాము బంగారం రూ.100లు. రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె. ఇలా అనేక వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందంటూ బాధితులు వాపోయారు.
రూ.10కే కిలో కందిపప్పు, వంటనూనె
మోసంపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
నమ్మించడానికి ముందు ఇచ్చిన గ్రాము బంగారం
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: గ్రాము బంగారం రూ.100లు. రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె. ఇలా అనేక వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామంటూ ఓ సంస్థ తమను మోసం చేసిందంటూ బాధితులు వాపోయారు. సుమారు 300మంది వద్ద దాదాపుగా రూ.3 కోట్లు వసూలు చేసుకున్నారంటూ గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు తదితర ప్రాంతాలకు చెందిన బాధితులు విజయలక్ష్మి, పద్మ, నాగలక్ష్మి, గుల్హాన్, షమీ, గోపి, మోహన్ సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ తుషార్ దూడి ప్రత్యేక విచారణకు ఆదేశించారు. అనంతరం బాధితులు విలేకరులతో వివరాలు తెలిపారు. అవి వారి మాటల్లోనే...
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్టు పేరుతో టోకరా
శ్రీనివాసరావు, అనంతలక్ష్మి, నిర్మల్ అనే వ్యక్తులు ప్రజా సేవా ఛారిటబుల్ ట్రస్టు పేరుతో హోమ్నీడ్స్, బంగారం, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులు నామమాత్రపు రుసుంకే అందిస్తామన్నారు. మంగళదాస్నగర్లో దుకాణం పెట్టి రూ.10లకే కిలో కందిపప్పు, వంటనూనె ఇస్తామంటూ ఆమేరకు ముగ్గురు, నలుగురికి ఇచ్చారు. తమ సంస్థలో రూ.300 కట్టి సభ్యత్వం తీసుకుంటే నిత్యావసర వస్తువులు మూడుసార్లు, రూ.1000 కడితే ఎన్ని పెట్టెలైనా తీసుకోవచ్చని డబ్బులు కట్టించుకొని ఒకరిద్దరికి ఇచ్చారు. తర్వాత రూ.100కు గ్రాము బంగారం అని ఒకరిద్దరికి ఇచ్చారు. రూ.1500 కడితే 10 గ్రాముల బంగారం అనగానే, ఒక్కసారిగా వందలాది మంది రావడంతో రూ.15 వేలకు నాలుగు గ్రాములు, రూ.24 వేలకు 10 గ్రాముల బంగారం అని డబ్బులు కట్టించుకున్నారు. ఇంకా టీవీ రూ.5 వేలు, ఫ్రిజ్ రూ.3,500లు, వాషింగ్మిషన్ రూ.5 వేలు, డబుల్కాట్ మంచం రూ.7 వేలు, ఏసీ రూ.20 వేలు అంటూ మాయచేసి కట్టించుకున్నారు. తమ ట్రస్టు వెనక ప్రజాప్రతినిధులు, వారి భార్యలు ఉన్నారని, ట్రస్టుకు వచ్చే వస్తువులు పేదలకు నామమాత్రపు రుసుంకే ఇస్తున్నామని నమ్మబలికారు. కందిపప్పు, బంగారం, ఫ్రిజ్, టీవీ తదితర వస్తువులకు ధర ఒకరోజు చెప్పిననట్టు, రెండోరోజు ఉండదు. అదేమంటే ఆ రోజు ధర అంతే, ఇష్టముంటే డబ్బులు కట్టండి అనేవారు. వందలాది మంది నుంచి ఫోన్పే రూపంలోనూ. కొంతమంది వద్ద నేరుగా నగదు తీసుకున్నారు. తర్వాత వస్తువులు వస్తాయంటూ నెలలు గడిపారు. బంగారానికి చాలామంది రూ.వేలు, రూ.లక్షలు చొప్పున కట్టారు. నాలుగు నెలలుగా శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లాడు. అదేమని అడిగితే విదేశాల నుంచి బంగారం తెస్తుంటే విమానాశ్రయంలో పట్టుకున్నారని, కేంద్ర మంత్రులతో మాట్లాడి విడిపించుకు వస్తానంటూ ఫోన్ తీయడం లేదని చెబుతున్నారు. సుమారు 300 మంది వద్ద దాదాపుగా రూ.3 కోట్లు వసూలు చేసుకొని మోసగించారు. న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.