Narasaraopeta: తలాడిస్తేనే సీటు.. లేకుంటే బదిలీ..
జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే వ్యవహారాలు రాజకీయాలతో ముడిపడి ఉంటున్నాయి. చివరకు అధికారుల బదిలీల విషయంలో కూడా రాజకీయమే ప్రధాన అస్త్రంగా ఉంటోంది. తాజాగా నరసరావుపేట పురపాలక కమిషనర్ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది
జిల్లా కేంద్రంలో అధికారులకు తప్పని కష్టాలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగే వ్యవహారాలు రాజకీయాలతో ముడిపడి ఉంటున్నాయి. చివరకు అధికారుల బదిలీల విషయంలో కూడా రాజకీయమే ప్రధాన అస్త్రంగా ఉంటోంది. తాజాగా నరసరావుపేట పురపాలక కమిషనర్ బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కోటప్పకొండ ఈవో శ్రీనివాస్రెడ్డిని బదిలీ చేస్తే వెళ్లనీయకుండా అడ్డుకోవడం.. పురపాలక సంఘంలో పనుల విషయంలో తమకు నచ్చిన అధికారిని తెచ్చుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీనిబట్టి తాము చెప్పినట్టు తలాడిస్తూ ఉండేవాళ్లకే పెద్దపీట వేస్తారని మరోసారి రుజువైందని పుర ప్రజలు విమర్శిస్తున్నారు.
కోటప్పకొండ ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన నల్లకాల్వ శ్రీనివాస్రెడ్డిని ఏసీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన ఈనెల 10న విధుల్లో చేరడానికి కోటప్పకొండ వచ్చారు. కానీ అధికార పార్టీ నేతలు తిరునాళ్ల తర్వాత రావాలని, ఇప్పుడు విధుల్లో చేరడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. చేసేది లేక వెళ్లిపోయారు. మరోసారి విధుల్లో చేరడానికి ప్రయత్నించినా వైకాపా నాయకులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇక చేసేది లేక ఏసీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. కోటప్పకొండ తిరునాళ్ల మొదటి సమీక్షా సమావేశంలో కూడా కలెక్టర్, జేసీలు కూడా ఈవో ఎవరు? మీరేనా? పూర్తిస్థాయి ఈవోనా? లేక ఇన్ఛార్జినా? మీ పేరేమిటి? అని అడగడం అక్కడ ఉన్న మిగతా అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఎమ్మెల్యే కలుగజేసుకుని ఆయన పేరు శ్రీనివాస్రెడ్డి అని, తిరునాళ్ల వరకూ ఉంటారని, తర్వాత కొత్త అధికారి వస్తారని చెప్పడం విశేషం. అంటే అధికారి రావాలన్నా.. వెళ్లాలన్నా.. వైకాపా పెద్దల నిర్ణయం ఉండాలా.. అని ఇతర అధికారులు గుసగుసలాడుకున్నారు. తిరునాళ్ల వరకూ తాము చెప్పిట్లు నడుచుకునే అధికారి అయితే బాగుంటుందని, అంతేకాకుండా ఇప్పటివరకూ జరిగినవాటికి లెక్కలు చెప్పాల్సి వస్తుందనే ఏసీ అధికారిని రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి.
అడ్డుగా ఉన్నారని పంపేశారా? : నరసరావుపేట పురపాలక కమిషనర్ అయిన రామ్మోహన్ను ఉన్నఫళంగా బదిలీ చేయడం.. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరుగురు కమిషనర్లు పురపాలక సంఘానికి రావడం ఓ తంతులా మారింది. సొంతంగా ఆలోచించకూడదు.. చెప్పినచోటల్లా సంతకాలు చేయాలి అనేవిధంగా ఉండటం వల్లే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక కమిషనర్లు మారిపోతున్నారని బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా గత నెలలో కమిషనర్ రామ్మోహన్ను నందిగామ బదిలీ చేశారు. అంతలోనే తర్వాతి రోజున యథాస్థితిలో ఆయన్నే కొనసాగించారు. బదిలీపై వెళ్లిన కమిషనర్ కోటప్పకొండ తిరునాళ్ల పనులను కూడా పరిశీలిస్తున్నారు. ఇంతలోనే బదిలీ చేశారు. గడప గడపకు బిల్లులు, చెక్కులపై నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు చేయాలని ఒత్తిళ్లు ఉండటం, వీటిని తిరస్కరించడం వల్లే బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ