YSRCP: కుదురుకొనేలోగా.. కుదిపేస్తున్నారు!
గుంటూరు పార్లమెంటు వైకాపా సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారు రోశయ్యను ఆ పార్టీ ప్రకటించింది. వైకాపా అధిష్ఠానం 26 రోజుల వ్యవధిలోనే మళ్లీ అభ్యర్థిని మార్చడం గమనార్హం
గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా రోశయ్య
26 రోజుల వ్యవధిలోనే ఎంపీ అభ్యర్థి మార్పు
ఈనాడు, అమరావతి: గుంటూరు పార్లమెంటు వైకాపా సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటరమణ స్థానంలో కిలారు రోశయ్యను ఆ పార్టీ ప్రకటించింది. వైకాపా అధిష్ఠానం 26 రోజుల వ్యవధిలోనే మళ్లీ అభ్యర్థిని మార్చడం గమనార్హం. పొన్నూరు అసెంబ్లీ స్థానానికి మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని సమన్వయకర్తగా నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తగా నియమించిన కిలారు రోశయ్య ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే గుంటూరు పార్లమెంటు స్థానానికి కిలారు రోశయ్య బావ అయిన ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించడంతో ఒకే పార్లమెంటు పరిధిలో ఇద్దరికి సీట్లు ఇస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి పొన్నూరు అసెంబ్లీ స్థానానికి పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
ఉమ్మారెడ్డి వెంకటరమణ సమన్వయకర్తగా నియమితులైన వెంటనే హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరులో కార్యాలయం ఏర్పాటు, ఇతర అంశాలపై దృష్టి సారించారు. పార్టీ నేతలు, శ్రేయోభిలాషులతో ఎన్నికల విషయమై చర్చించారు. ఈనెల 15న ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం సభకు సీఎం హాజరుకాగా దానికి ఆయన హాజరయ్యారు. అప్పటి నుంచి ఆయన అంత క్రియాశీలకంగా లేరు. అయిదు రోజులుగా స్థానికంగా లేకపోగా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పోటీకి విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో కిలారు రోశయ్యను నియమించారన్న వాదన వినిపిస్తోంది. పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాత సమన్వయకర్తలను ఎంపిక చేస్తున్నామని అధిష్ఠానం చెప్పడంతో నియమితులైన వారు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో అభ్యర్థులను మారుస్తుండడంపై ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. ఇ
లా అభ్యర్థులను మార్చడం వల్ల పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులపై కూడా ప్రభావం పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ ప్రాతిపదికన నియమిస్తున్నారో... ఎందుకు తప్పిస్తున్నారో తెలియడం లేదని కార్యకర్తల్లో గందరగోళం మొదలైంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు వైకాపాలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడైన ఉమ్మారెడ్డి వెంకటరమణను రాజకీయ వారసుడిగా తీసుకురావాలని రెండు దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈసారి అవకాశం వచ్చిందన్న ఆనందంలో ఉండగానే మళ్లీ ఆయన్ను తప్పించడంతో మరోసారి ఆయనకు నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారి తీస్తోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
పొన్నూరుకు అంబటి మురళి
భజరంగ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అంబటి మురళిని పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆయన జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు సోదరుడు. ఆయన పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందినవారు. భజరంగ ఫౌండేషన్ స్థాపించి గత కొన్నాళ్లుగా పొన్నూరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పొన్నూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే అంబటి రాంబాబు సత్తెనపల్లికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఒకే కుటుంబంలో ఇద్దరికి సీటు కేటాయిస్తారా? అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు అంబటి మురళికి పొన్నూరులో అవకాశం ఇవ్వడంతో సత్తెనపల్లి సీటు విషయమై మరోసారి చర్చనీయాంశమైంది. ఏదీ ఏమైనా వైకాపా సమన్వయకర్తల జాబితా వస్తుందంటే ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారో... కొత్తవారు ఎవరు తెరపైకి వస్తారోనన్న ఆందోళన ఆ పార్టీ అభ్యర్థుల్లో నెలకొంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే నియమించిన సమన్వయకర్తలను మారుస్తుండడం బలం చేకూరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు