మిర్చి రైతు దిగాలు..!
మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
దిగుబడుల వేళ తగ్గిన ధర
కూలి ధర పెంపుతో భారం
కల్లంలో ఆరబోసిన ఎర్ర బంగారం
నరసరావుపేట వ్యవసాయం, న్యూస్టుడే: మిర్చికి మంచి ధర ఉండటంతో రైతులు గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఒడుదొడుకులను ఎదుర్కొని పంట సాగు చేశారు. సాగు వేళ క్వింటా మిర్చి ధర రూ.22 వేలు పలకడంతో రైతులు సంబరపడ్డారు. కానీ పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం క్వింటా తేజ రకం రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంది. వేరే రకాలు అయితే రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్నాయి. ఇలా ఆందోళనలో ఉన్న రైతులకు కూలీల కొరత వేధిస్తోంది. కోత కూలి గతంలో రూ.240 ఉండగా ఇప్పుడు రూ.450కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో రూ.460 వరకు ఉంది. దీంతో మిర్చి రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగని దిగుబడులూ ఆశాజనకంగా లేవు.
జిల్లాలో 55,969 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. తొలినాళ్లలో తోటలు బాగానే ఉన్నాయి. పూత, పిందె దశలో వచ్చిన తుపాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీనికి తోడు నల్ల తామర పురుగు ఆశించటంతో దాని నివారణకు రోజు మార్చి రోజు పురుగు మందుల పిచికారీ చేయటం, సకాలంలో వర్షాలు లేక ట్యాంకర్ల ద్వారా తడులు అందించటం వల్ల పెట్టుబడి పెరిగింది. అయినా అశించిన దిగుబడులు రావటం లేదు. ఎకరాకు 18 క్వింటాళ్ల నుంచి 20 వరకు వస్తాయని ఆశించగా తుపాను, నల్లతామర పురుగు ప్రభావంతో ఆశలకు గండి పడింది.
ప్రస్తుతం మిర్చికోత కూలి రేట్లు భగ్గుమంటున్నాయి. జనవరి రెండో వారంలో మిర్చి కోత కూలి ఒక్కో మనిషికి రూ.350 ఉండగా నేడు రూ.450కి చేరింది. మరి కొన్ని గ్రామాల్లో రూ.460 వరకు చెల్లిస్తున్నారు. కూలి ఇవ్వడంతో పాటు వారిని పొలం వరకు ఆటో లేదా ట్రాక్టర్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా రైతులదే. 13 మంది కూలీలు కలిసి క్వింటా కాయలు కోస్తారు. రూ.450 చొప్పున లెక్క వేసినా క్వింటాకు రూ.6 వేలు అవుతుంది. తాలుకాయలు వేరు చేసేందుకు మరో రూ.2 వేలు అవుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుత కూలి ధరను పరిశీలిస్తే ఇంటిల్లిపాది కష్టపడినా కూలి కూడా దక్కే పరిస్థితి లేదని రైతులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏ ఎండకా గొడుగు!
[ 26-07-2024]
ప్రస్తుతం గుంటూరులో పని చేస్తున్న ఓ సీఐ వైకాపా హయాంలో ఒక ప్రజాప్రతినిధితో బాగా అంటకాగారు. ఈయనకు తన సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడికి పంపేందుకు కూటమి నాయకుడొకరు పట్టుబడుతున్నారు. -
ఎందెందు వెదికినా.. ఈ కలుపు మందే!
[ 26-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. ఇందుకోసం కొంతమంది వ్యక్తులు అనేక అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు...నాటి జగన్ సర్కారు చేసిందిదే. -
ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా తిన్నదెవరు?
[ 26-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పొరుగు సేవల ఉద్యోగులకు సంబంధించిన ఈఎస్ఐ, ఈపీఎఫ్ వాటా సొమ్మును కాజేసిన వ్యవహారంపై ఇన్ఛార్జి వీసీ కె.గంగాధరరావు విచారణకు ఆదేశించారు. -
సేవలకు రాం రాం.. వసూళ్లకు పరిమితం
[ 26-07-2024]
రైతు సేవలకు నిర్దేశించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రుసుం వసూలు కేంద్రాలుగా మారాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాల్సిన యార్డులు రైతులకు దూరమయ్యాయి. -
నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలకు దరఖాస్తు
[ 26-07-2024]
-
రూ.కోట్లు కొల్లగొట్టిన వైకాపా నేతలు
[ 26-07-2024]
నాణ్యమైన ఎర్రమట్టి.. ప్రభుత్వ భూములతోపాటు విస్తారంగా అటవీ భూములు.. ఎంత తవ్వినా అడిగేవారు ఉండరు.. అధికారపార్టీ నేతల అండతో తవ్వకాలు జరుగుతుండటంతో అధికారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి.. డిమాండ్ లక్ష్యంగా ఎర్రమట్టి తవ్వి తరలించి సొమ్ము చేసుకున్నారు -
ఇంట్లోకి చొరబడి బాలికతో అసభ్య ప్రవర్తన
[ 26-07-2024]
కామంతో కళ్లు మూసుకు పోయిన ఓ కామాంధుడు అర్ధరాత్రి ఒక బాలికను చెరబట్టబోయాడు. ఆ బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో ప్రమాదం నుంచి బయటపడింది. -
ఊసరవెల్లి నయం
[ 26-07-2024]
వైకాపా పాలనలో కొంతమంది సీఐలు ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించారు. చట్టాన్ని చుట్టచుట్టి మూలన పడేసి వైకాపా సెక్షన్ల అమల్లో పోటీ పడ్డారు. ఖాకీల ముసుగులో నీలి మూకలుగా చెలరేగిపోయారు. -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
[ 26-07-2024]
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు
[ 26-07-2024]
రైతు భరోసా కేంద్రాల్లో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 21 రోజుల్లో చెల్లింపులు చేయకుండా వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్