కమిటీ వేసి చేతులు దులిపేసుకుంటారా..?
దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్స్టోరేజి దగ్ధం విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. రైతులకు సత్వరం
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పక్కన శివశంకర్
దుగ్గిరాల, న్యూస్టుడే: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్స్టోరేజి దగ్ధం విషయంలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే రైతులకు న్యాయం జరుగుతుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. రైతులకు సత్వరం న్యాయం జరగాలని కోరుతూ పసుపు రైతులు, బాధితులతో కలిసి రైతు సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్ని ఎమ్మెల్సీ శుక్రవారం ప్రారంభించారు. ఇంత ప్రమాదం జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు, బీమా కంపెనీలు ఎవరూ సరిగా స్పందించలేదన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సుమారు 80 వేల క్వింటాళ్ల సరకు ఉందని, వందలాది మంది రైతులు నష్టపోయారని లక్ష్మణరావు అన్నారు. విచారణ పేరుతో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ క్వింటాకు రూ.13 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. కోల్డ్స్టోరేజి యజమాని మీద చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ, హోంమంత్రి కానీ, ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కానీ స్పందించాలన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు జరిగే అన్ని ఉద్యమాలకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఉంటుందన్నారు. పసుపురైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకర్ మాట్లాడుతూ కోల్డ్స్టోరేజి ఇచ్చిన లెక్కల ప్రకారం 381 మంది రైతులు 1,04,260 బస్తాలున్నాయని, యార్డు లెక్కలు బయటపెట్టాలన్నారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ రైతులకు సంఘీభావంగా ఎమ్మెల్యే, మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతు సంఘ నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నులకా శివసాంబిరెడ్డి, వేములపల్లి వెంకట్రామయ్య, జెట్టి బాలరాజు, అమ్మిరెడ్డి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కాట్రగడ్డ శివరామకృష్ణయ్య, కాజా వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకుడు లోకం భాస్కరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఆళ్ల వెంకటప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్