పెత్తందారులకే దారులా..పేదలంటే అలుసా?
మంగళగిరి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో శుక్రవారం ఉదయం బాప్టిస్టుపేటకు వెళ్లిన గంజి చిరంజీవిని స్థానికులు నిలదీశారు. గుడ్మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించిన సందర్భంగా స్థానికులు సమస్యలపై ప్రశ్నించారు.
బాప్టిస్టుపేటలో గంజికి చేదు అనుభవం
ఆర్కే డౌన్.. డౌన్ అంటూ దళితుల నినాదాలు
చిరంజీవిని నిలదీస్తున్న స్థానికులు
మంగళగిరి, న్యూస్టుడే: మంగళగిరి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి హోదాలో శుక్రవారం ఉదయం బాప్టిస్టుపేటకు వెళ్లిన గంజి చిరంజీవిని స్థానికులు నిలదీశారు. గుడ్మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించిన సందర్భంగా స్థానికులు సమస్యలపై ప్రశ్నించారు. ‘తమపేటలో పైపులైన్ల పేరుతో రోడ్లు పగలగొట్టి రెండేళ్లవుతోంది. ఇంతవరకు వాటిని పునరుద్ధరించలేదని’ నిలదీశారు. పెత్తందారులంటే ఎవరు? పేదవాళ్లంటే ఎవరు? పేదవాళ్లకు మీరు ఏమి న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. పెత్తందారులైన మురుగుడు హనుమంతరావు ఇంటి ముందు రోడ్డువేశారు. పేదవాళ్లైన దళితుల ఇళ్ల ముందు రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చిరంజీవి నవరత్న పథకాలు ఉన్నాయి కదా అని సమాధానమిచ్చే సందర్భంలో పక్కనే ఉన్న మరొకరు అవి పక్కన పెట్టి మాపల్లెకు ఏమి చేశారంటూ నిలదీశారు. పథకాలంటున్నారు..ఎంతమందికిచ్చారంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా ప్రశ్నించే వారిపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులు దళిత ద్రోహి ఆర్కే రాలేదా? మా పెద్దలను మోసం చేసి స్థలం తీసుకుని సామాజిక భవనం కడతానన్నారు. సగంలో నిలిపివేశారన్నారు. 46 గ్రామాల్లో దళితులపై ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. పార్టీలకు సంబంధం లేకుండా దళితులుగా తాము మాట్లాడుతున్నామన్నారు. కాలనీలో నీటి సౌకర్యం సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం. దానికి పరిష్కారమేదైనా చెప్పగలుగుతారా? అంటూ నిలదీశారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ గతంలో ఎందుకు చేయలేదని నన్ను అడగవద్దు.. ఇప్పుడు నేను చేస్తానని చెబుతున్నానంటూ ఇచ్చిన సమాధానానికి వారు సంతృప్తి చెందలేదు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నా..15వ వార్డులోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
చేతి వృత్తి పనికి కేటాయించిన కబేళా స్థలంలో సబ్స్టేషన్కు 25 సెంట్లు స్థలాన్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రయివేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. దళితులను విభజించే వైకాపాకు చరమగీతం పాడాలని కోరారు. 2024లో దళితులంతా తగిన బుద్ధి చెప్పబోతున్నారన్నారు. అనంతరం దళితవాడకు సామాజిక భవనం వెంటనే నిర్మించాలని, దళితులపై వైకాపా నిర్లక్ష్యం విడనాడాలని, దళిత ద్రోహి ఆర్కే డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్