రా..కదలిరా సభకు సర్వం సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నా ‘రా.... కదలిరా’ కార్యక్రమం శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి వద్ద నిర్వహిస్తున్నారు
దాచేపల్లికి రానున్న తెదేపా అధినేత చంద్రబాబు
తరలిరానున్న కార్యకర్తలు
ఏర్పాట్లు పరిశీలిస్తున్న తెదేపా నేతలు
ఈనాడు, అమరావతి, గురజాల: రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ పీడిత వర్గాలను ఏకం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్నా ‘రా.... కదలిరా’ కార్యక్రమం శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెదేపా శ్రేణులకు అధినేత చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేయనున్నారు. తెదేపా అధికారంలోకి వస్తే పల్నాడు ప్రాంతం అభివృద్ధికి ఏం చేస్తామో నిర్దిష్టంగా వివరించనున్నారు. వైకాపా పాలనలో పల్నాడు ప్రాంతంలో జరిగిన అరాచకాలు, దోపిడీ, హత్యలు, ప్రజల ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించి వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో పల్నాడు తెదేపా నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జనసమీకరణ చేస్తున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు రెండురోజులుగా సభా ఏర్పాట్లలోనే నిమగ్నమయ్యారు. విశాలమైన ప్రాంగణాన్ని ఎంపిక చేసి కార్యకర్తలు, నేతలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబు సమక్షంలో శనివారం తెదేపా తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం మధ్యాహ్నం తర్వాత దాచేపల్లి చేరుకునే చంద్రబాబునాయుడు రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళతారు.
నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న రా... కదలిరా సభకు పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. ఇందుకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిలు జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. పల్నాడులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని, అందుకు దాచేపల్లి సభ ద్వారా నాంది పలుకుతామని నేతలు ప్రకటించారు. వైకాపా పాలనలో విసిగిపోయిన ప్రజలు భారీఎత్తున తరలివచ్చి అధినేత చంద్రబాబుకు అండగా నిలుస్తారని చెబుతున్నారు. దాచేపల్లి సభకు అధినేత హాజరుకానుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. తెదేపా-జనసేన పొత్తు ఖరారై సీట్లు ప్రకటన తర్వాత పల్నాడులో నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో జనసేన శ్రేణులు, నేతలు హాజరుకానున్నారు. ఈ సభ ఇరుపార్టీల కార్యకర్తల్లో జోష్ నింపుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. పల్నాడులో తెదేపాకు బలమైన కార్యకర్తలు ఉన్నందున వారంతా తరలివస్తే సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోనుంది. ఈ సభ ద్వారా పల్నాడులో ఎన్నికల శంఖారావానికి నాంది పలకనున్నారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ... భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంతో ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం చేశారు. బహిరంగసభలో ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలతోపాటు యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, పరిశ్రమల అభివృద్ధికి తెదేపా ఏవిధమైన ప్రణాళికలు అమలు చేస్తుందో చంద్రబాబు వివరించనున్నారు. వేలమంది తరలించి సభను విజయవంతం చేయడానికి పల్నాడు జిల్లా తెదేపా నేతలు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్