ఆనందం ఆవిరైంది.. మృత్యువు కబళించింది
బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆనందంగా గడిపి కారులో ఇంటికి బయలుదేరారు. మరో అర గంటలో గమ్యస్థానం చేరతారనగా రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కబళించింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
గుంటూరు రూరల్, న్యూస్టుడే: బంధువులతో కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అందరితో కలిసి ఆనందంగా గడిపి కారులో ఇంటికి బయలుదేరారు. మరో అర గంటలో గమ్యస్థానం చేరతారనగా రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను కబళించింది. ఈ దుర్ఘటన శుక్రవారం వేకువజామున బైపాస్ రోడ్డులోని బొంతపాడు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం... మంగళగిరికి చెందిన బంధువుల కారు తీసుకుని పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగిన పెళ్లికి హాజరయ్యారు. వేడుకలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు బొంతపాడు సమీపంలోకి వచ్చాక ముందు వెళ్తున్న కంకర ట్రాక్టర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో గార్లపాటి వెంకట సుబ్బమ్మ(47), గార్లపాటి పావని(17) గార్లపాటి శ్యామ్ దీక్షిత్(6) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ ఏకుల శ్రీకాంత్తోపాటు గార్లపాటి నాగలక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. మరో మహిళ రాధకు స్వల్ప గాయాలయ్యాయి. గార్లపాటి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రాంబాబు తెలిపారు
శ్యామ్ దీక్షిత్ తల్లిని ఓదారుస్తున్న కుటుంబ సభ్యులు
లోకేశ్ దిగ్భ్రాంతి.. రోడ్డు ప్రమాదంలో మంగళగిరికి చెందిన ముగ్గురు మృతి చెందడంపై యువనేత, తెదేపా ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
మూడు కుటుంబాల్లో విషాదం
మంగళగిరి, న్యూస్టుడే: రోడ్డు ప్రమాదం మంగళగిరి గండాలయపేటకు చెందిన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. బంగారపు పనిచేస్తూ జీవించే రామకృష్ణకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు శ్యామ్దీక్షిత్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తాపీ పని చేసుకునే అంజి కుమార్తె పావని మంగళగిరిలోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ బాలిక కన్నుమూసింది. వెంకటసుబ్బమ్మ ఇంటి వద్దనే అల్పాహారం విక్రయిస్తూ జీవిస్తుంది. వీరంతా బంధువులు కావడంతో ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. దీక్షిత్ మరణవార్త విన్న తల్లి రాధ బోరున విలపిస్తుండగా ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. పావని మృతి చెందిందనే విషయాన్ని ఆమె తల్లి నాగలక్ష్మికి తొలుత కుటుంబ సభ్యులు చెప్పలేదు. ఆతరువాత సంఘటన తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది. అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న వెంకటసుబ్బమ్మ మరణం ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగరమా.. నరకమా...!
[ 27-07-2024]
పర్యవేక్షణ లేమి.. విధానపరమైన నిర్ణయాల్లో లోపాల కారణంగా గుంటూరు నగరాభివృద్ధి ముందుకు కదలడం లేదు. -
కదలి వస్తున్న కృష్ణమ్మ
[ 27-07-2024]
కృష్ణాలో జలకళ ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల్లో ఆశలు రేపుతోంది. సాగర్ కాలువలకు నీరొస్తే 80 శాతం ఆయకట్టుకు ఇబ్బందులు తీరినట్టే. -
తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కొనుగోళ్లపై జనం ఆసక్తి
[ 27-07-2024]
తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోంది. తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఆరు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లను తెరిచింది. -
లైసెన్స్ కావాలంటే..పాఠం వినాల్సిందే..!
[ 27-07-2024]
ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే చేతిలో వాహనం ఉండాల్సిందే. ప్రజలు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తుంటారు. -
అసైన్డ్ భూముల్లో అక్రమ రిసార్టులు
[ 27-07-2024]
సూర్యలంకలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు వైకాపా నేతలు అక్రమంగా సేకరించి నిబంధనలకు విరుద్ధంగా రిసార్టులు నిర్మించారు. -
శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై ఆరా
[ 27-07-2024]
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో రాతిమండపం నిర్మాణానికి తితిదే శ్రీవాణి ట్రస్టు నుంచి రూ.రెండు కోట్ల నిధులు మంజూరు చేయగా వీటితో చేపట్టిన పనులు జరుగుతున్నాయా లేదా అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు అధికారులు శుక్రవారం పరిశీలించారు. -
ఆటల్లో మనమెక్కడ?
[ 27-07-2024]
2022 కామన్వెల్త్, 2021 రియో ఒలింపిక్స్.. మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారులను మెరిసేలా చేశాయి. -
ఈ కలుపు మందే!
[ 27-07-2024]
నిషేధిత కలుపు మందు గ్లైసెల్ ఎక్కడబడితే అక్కడ దొరుకుతోందనడానికి ఈ ఉదంతాలే నిదర్శనం. -
పరీక్ష పేరుతో శిక్షా?
[ 27-07-2024]
ఒక పక్క పుస్తకాలు సకాలంలో అందక, టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాలతో సిలబస్ పూర్తికాక సతమతమవుతుంటే.. మరోవైపు ఆగస్టు 1 నుంచి ఫార్మెటివ్ - 1 పరీక్షలను నిర్వహించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికలకు వచ్చిన తహసీల్దార్లు వెనక్కి
[ 27-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి